మహిళపై ఆర్మీ జవాన్ల గ్యాంగ్ రేప్
కొచ్చి : ఆర్మీ జవాన్లు ఓ మహిళపై అత్యాచారం చేసిన ఘటన కేరళలోని ఎర్నాకుళంలో చోటు చేసుకుంది. ముగ్గురు ఆర్మీ జవాన్లు కలిసి ఎర్నాకుళంలోని ఓ లాడ్జిలో మహిళపై అత్యాచారం చేశారు. ప్రియుడిగా మహిళకు దగ్గరైన మహమ్మద్ సలీమ్ (28) అనే ఓ జవాన్.. మహమ్మద్ మిస్బా (28), ఇక్బాల్ హుస్సేన్ (25) తో కలిసి ఈ ఘాతుకానికి తెగబడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మహమ్మద్ సలీమ్.. గత జనవరిలో ఎర్నాకుళంలోని ఓ లాడ్జిలో ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం మొబైల్ ద్వారా ఆమె న్యూడ్ ఫోటోలను తీశాడు.

సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకుంటానని సలీం ఆమెను నమ్మించడంతో.. గత సోమవారం అతని పిలుపు మేరకు ఎర్నాకుళంలోని లాడ్జికి వెళ్లింది బాధిత మహిళ. దీంతో అప్పటికే మరో ఇద్దరు స్నేహితులతో కలిసి లాడ్జి గదిలో ఉన్న సలీం.. మహిళపై సామూహిక అత్యాచారం చేశాడు. అత్యాచారం తర్వాత తీవ్ర ఆగ్రహానికి లోనైన బాధిత మహిళ మిస్బా సర్టిఫికెట్లను చించేయడంతో.. ఆమెను తీవ్రంగా కొట్టాడు మిస్బా.
దాడి తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జవాన్ల బాగోతం బయటపడింది. ఇదిలా ఉంటే.. అత్యాచారం చేసిన సలీం, మిస్బా శ్రీనగర్ మరియు కోల్ కతాలలో ఆర్మీ సప్లయిస్ కార్ప్ లో పనిచేస్తున్నారు. మరో నిందితుడు ఇక్బాల్ హుస్సేన్ కూడా పారామిలటరీ అధికారిగా విధులు నిర్వర్తిస్తుండడం గమనార్హం.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications