బెంగళూరు ఆసుపత్రిలో టైటాన్ ఫౌండర్ దేశాయి మృతి
బెంగళూరు: టైటాన్ వాచ్ మేకర్ అండ్ ఫౌండర్ జిరక్స్ దేశాయి సోమవారం నాడు కన్నుమూశారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో తన 79వ ఏట అతను మృతి చెందారు. ఇతను గత కొద్ది రోజులుగా డెంగ్యూ, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు.
ఇతను తన భార్య రజినీ దేశాయి, కొడుకు శయేష్, కూతురు అన్నహితా, సోదరి అర్మిత దేశాయితో కలిసి చాలారోజులుగా డిఫెన్స్ కాలనీలో ఉంటున్నారు. అతని మృతదేహం జూన్ 30వ తేదీన ఇంటికి తీసుకు వెళ్లనున్నారు. అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు జరపనున్నారు.
జిరక్స్ దేశాయి జంతు ప్రేమికుడు. శాస్త్రీయ సంగీతం తెలుసు. బాగా పుస్తకాలు చదువుతారు. కొత్త కొత్త ఆలోచనలు అతనికి వస్తుంటాయి.

ఇతను ఎల్పిన్స్టోన్ కాలేజీలో బీఏ (హిస్టరీ) చేశారు. ఆక్స్ఫర్ట్ యూనివర్సిటీలో ఎంఏ (ఫిలాసపీ, ఎకనామిక్స్, పాలిటిక్స్) చేశారు. 1980లలో ఫస్ట్ క్వార్ట్జ్ వాచ్ పరిచయం చేయడంలో ఇతని పాత్ర కూడా ఉంది. అదే సమయంలో ఇతను టైటాన్ కంపెనీ లిమిటెడ్ ప్రారంభించారు.
టైటాన్ వాచ్ మేకర్ అండ్ ఫౌండర్ జిరక్స్ దేశాయి సోమవారం నాడు కన్నుమూశారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో తన 79వ ఏట అతను మృతి చెందారు. ఇతను గత కొద్ది రోజులుగా డెంగ్యూ, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు.












Click it and Unblock the Notifications