ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు బహిష్కరణ: టీఎంసీ, సర్దుకున్నారా !
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారని ఆరోపించారు. అందుకే తాము ఆర్ కే నగర్ ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నామని తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ అధ్యక్షుడు జీకే. వాసన్ చెప్ప
సేలం/చెన్నై: ఆర్ కే నగర్ ఉప ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నామని తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ అధ్యక్షుడు జీకే. వాసన్ అన్నారు. టీఎంసీ పార్టీ పదాధికారులు, నాయకులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని జీకే. వాసన్ వివరించారు.
సేలంలోని విజయరాఘవాచారి హాలులో పార్టీ నిర్వహకుల సమావేశం నిర్వహించారు. అనంతరం వాసన్ మీడియాతో మాట్లాడుతూ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడం లేదని, ఎవరికీ తాము మద్దతు తెలపడం లేదని స్పష్టం చేశారు.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారని ఆరోపించారు. అందుకే తాము ఆర్ కే నగర్ ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వాసన్ చెప్పారు. గతంలో ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించే వారని గుర్తు చేశారు.
అయితే ఇప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు కోరే పరిస్థితి ఏర్పడిందని వాసన్ విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ న్యాయమైన విధానంతో ఎన్నికలు నిర్వహించాలని, అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతోందని ప్రజలు కోరుకుంటున్నారని టీఎంసీ పార్టీ అధ్యక్షుడు జీకే. వాసన్ అన్నారు.