వేధింపులకు గురిచేశారు: పశ్చిమబెంగాల్ గవర్నర్పై మహిళ సంచలన ఫిర్యాదు
కోల్కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తనను వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. ఈ మేరకు అక్కడి రాజ్ అక్కడి రాజ్ భవన్లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం విషయమై బోస్ ఆ మహిళను రెండు సార్లు పిలిచినట్లు, ఆ రెండు సందర్భాల్లోనూ వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది.
ఇందుకు సంబంధించిన వివరాలను టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. అయితే, ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక దీనిపై స్పందించేందుకు పోలీసులు ఆసక్తి చూపలేదు. అయితే శుక్రవారం బెంగాల్లో ప్రధాని నరేంద్ర మోడీ రెండు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

శుక్రవారం కృష్ణానగర్, వర్ధమాన్ పుర్బా, బోల్పూర్ లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్పై ఇలాంటి ఆరోపణలను రావడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, ఈ ఆరోపణలపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ స్పందించారు. సత్యం గెలుస్తందని వ్యాఖ్యానించారు. కల్పిత కథనాలను చూసి తాను భయపడనని చెప్పారు. 'ఇలా నన్ను కించపరచడం ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని ఎవరైనా కోరుకుంటే.. గాడ్ బ్లెస్ దెమ్. కానీ, బంగాల్లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా నా పోరాటాన్ని ఆపలేరు' అని బోస్ స్పష్టం చేశారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications