Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వేధింపులకు గురిచేశారు: పశ్చిమబెంగాల్ గవర్నర్‌పై మహిళ సంచలన ఫిర్యాదు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్​ గవర్నర్​ సీవీ ఆనంద​ బోస్ తనను​ వేధింపులకు గురిచేశారంటూ ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. ఈ మేరకు అక్కడి రాజ్ అక్కడి రాజ్ ​భవన్‌​లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానికంగా ఉన్న హరే స్ట్రీట్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం విషయమై బోస్​ ఆ మహిళను రెండు సార్లు పిలిచినట్లు, ఆ రెండు సందర్భాల్లోనూ వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించింది.

ఇందుకు సంబంధించిన వివరాలను టీఎంసీ ఎంపీ సాగరిక ఘోష్ ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. అయితే, ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇక దీనిపై స్పందించేందుకు పోలీసులు ఆసక్తి చూపలేదు. అయితే శుక్రవారం బెంగాల్​లో ప్రధాని నరేంద్ర మోడీ రెండు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.

TMC MP alleges West Bengal governor CV Ananda Bose accused of molesting a woman

శుక్రవారం కృష్ణానగర్, వర్ధమాన్ పుర్బా, బోల్పూర్ లోక్‌సభ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌పై ఇలాంటి ఆరోపణలను రావడం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు, ఈ ఆరోపణలపై గవర్నర్​ సీవీ ఆనంద్​ బోస్​ స్పందించారు. సత్యం గెలుస్తందని వ్యాఖ్యానించారు. కల్పిత కథనాలను చూసి తాను భయపడనని చెప్పారు. 'ఇలా నన్ను కించపరచడం ద్వారా ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని ఎవరైనా కోరుకుంటే.. గాడ్​ బ్లెస్​ దెమ్. కానీ, బంగాల్​లో అవినీతి, హింసకు వ్యతిరేకంగా నా పోరాటాన్ని ఆపలేరు' అని బోస్​ స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+