మమతా బెనర్జీకి సొంత ఎమ్మెల్యే ఝలక్, బీజేపీలోకి అర్జున్ సింగ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలకమైన నాయకుడు, భట్పారా నియోజకవర్గం ఎమ్మెల్యే అర్జున్ సింగ్ గురువారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీలో చేరే కంటే ముందు ఆ పార్టీ నేత ముకుల్ రాయ్తో అర్జున్ సింగ్ ఢిల్లీలో చర్చలు జరిపారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అర్జున్ సింగ్ మీడియాతో మాట్లాడారు.
మమతా బెనర్జీ నేతృత్వంలో నలభై ఏళ్ల పాటు పని చేశానని, కానీ బాలాకోట్లో జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసినప్పుడు మన దేశ ఆర్మీ విశ్వసనీయతను మమత బెనర్జీ ప్రశ్నించారు, ఆ సమయంలో తాను బాధపడ్డానని చెప్పారు.

దేశం మొత్తం పాకిస్థాన్కు వ్యతిరేకంగా నినదిస్తే మమతా బెనర్జీ మాత్రం ప్రధానిని విమర్శించారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. ఇదిలా ఉండగా, బార్రక్పోర్ లోకసభ నియోజకవర్గానికి తాను పోటీ చేస్తానని అర్జున్ సింగ్ చెప్పగా, మమతకు నిరాకరించారు. దీంతో ఆయన పార్టీ మారారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications