Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్పీకర్, పళని, పన్నీర్ భేటీ: రెబల్ ఎమ్మెలేల మీద అనర్హత వేటు ? టెన్షన్ తో రిసార్ట్ లో టీవీ !

తమిళనాడు స్పీకర్ ధనపాల్ తో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శుక్రవారం మధ్యహ్నాం భేటీ అయ్యారు.

చెన్నై: తమిళనాడు స్పీకర్ ధనపాల్ తో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శుక్రవారం మధ్యహ్నాం భేటీ అయ్యారు. అన్నాడీఎంకే పార్టీ మీద తిరుగుబాటు చేసిన రెబల్ ఎమ్మెల్యేల విషయంపై ముగ్గురు చర్చలు జరుపుతున్నారు.

చెన్నైలోని సచివాలయంలో స్పీకర ధనపాల్, సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం భేటీ అయ్యి కర్ణాటకలోని కొడుగు ప్రాంతంలో రిసార్ట్ లో ఉన్న రెబల్ ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటూ సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు.

TN Assembly Speaker holding meeting with CM, DCM at Secretariat

తమిళనాడు ప్రభుత్వం మీద ఎందుకు తిరుగుబాటు చేశారు ? అన్నాడీఎంకే పార్టీ నియమాలు ఎందుకు పాటించడం లేదు అని సమాధానం ఇవ్వాలని స్పీకర్ ధనపాల్ ఇప్పటికే మూడు సార్లు దినకరన్ గ్రూప్ లో ఉన్న 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు.

మూడో సారి పంపించిన నోటీసులకు గురువారం సాయంత్రంతో గడుపు పూర్తి అయ్యింది. రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని తమిళనాడు ప్రభుత్వ చీప్ విప్ రాజేంద్రన్ శుక్రవారం ఉదయం స్పీకర్ ధనపాల్ కు మనవి చేశారు.

ప్రభుత్వ చీప్ విప్ రాజేంద్రన్ స్పీకర్ ధనపాల్ తో భేటీ అయిన కొన్ని గంటలకే ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం ఆయనతో భేటీ కావడంతో ఏం జరుగుతుందో అంటూ దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు కొడుగులోని రిసార్ట్ లో టీవీల ముందు కుర్చుని టెన్షన్ తో హడలిపోతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+