అసాధారణ రీతిలో.. యూపీలో 'యోగి' పాలనపై ఓ కన్నేసి ఉంచిన మోడీ
యూపీలో కొత్త సీఎంగా కొలువుదీరిన యోగి ఆదిత్యానాథ్ ను ఆయన అనుచరులు 'భవిష్యత్తు ప్రధాని' అంటూ ఇప్పటినుంచే ట్యాగులు తగిలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు ప్రధాని మోడీ సైతం యోగి పాలనపై ఓ కన్నేసి ఉం
లక్నో: యూపీలో కొత్త సీఎంగా కొలువుదీరిన యోగి ఆదిత్యానాథ్ ను ఆయన అనుచరులు 'భవిష్యత్తు ప్రధాని' అంటూ ఇప్పటినుంచే ట్యాగులు తగిలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు ప్రధాని మోడీ సైతం యోగి పాలనపై ఓ కన్నేసి ఉంచాలని పీఎంవో వర్గాలను ఆదేశించారు.
పీఎంవో ఆదేశానుసారం ప్రభుత్వాన్ని నడిపిస్తూ.. పాలనా సంబంధమైన వివరాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి అందించేలా మోడీ ఓ ప్రత్యేక ఐఏఎస్ అధికారిని సైతం నియమించడం గమనార్హం. 'అసాధారణ రీతిలో ఐఏఎస్ నృపేంద్రమిశ్రాను యూపీ పాలనా పర్యవేక్షకుడిగా నియమించడం చర్చనీయాంశంగా మారింది'.

ఇదే క్రమంలో పీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ మిశ్రా ఆదివారం నాడు సీఎం యోగితో దాదాపు 45నిమిషాల పాటు భేటీ అయ్యారు. దీంతో ఇకనుంచి సీఎం యోగికి, పీఎం మోడీకి మధ్య మిశ్రా దూతగా వ్యవహరిస్తారన్న సంకేతాలు వెలువెడ్డాయి. ఈ మేరకు జాతీయ మీడియా ఇండియా టుడే ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
కాగా, యూపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన నృపేంద్రమిశ్రాను 2014లో ప్రధాని మోడీ ఏరి కోరి కేంద్రానికి పిలిపించుకున్నారు. యూపీ ప్రభుత్వం ఇకముందు చేపట్టబోయే నియామకాలను సైతం మిశ్రానే ధ్రువీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications