అసాధారణ రీతిలో.. యూపీలో 'యోగి' పాలనపై ఓ కన్నేసి ఉంచిన మోడీ
యూపీలో కొత్త సీఎంగా కొలువుదీరిన యోగి ఆదిత్యానాథ్ ను ఆయన అనుచరులు 'భవిష్యత్తు ప్రధాని' అంటూ ఇప్పటినుంచే ట్యాగులు తగిలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు ప్రధాని మోడీ సైతం యోగి పాలనపై ఓ కన్నేసి ఉం
లక్నో: యూపీలో కొత్త సీఎంగా కొలువుదీరిన యోగి ఆదిత్యానాథ్ ను ఆయన అనుచరులు 'భవిష్యత్తు ప్రధాని' అంటూ ఇప్పటినుంచే ట్యాగులు తగిలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటు ప్రధాని మోడీ సైతం యోగి పాలనపై ఓ కన్నేసి ఉంచాలని పీఎంవో వర్గాలను ఆదేశించారు.
పీఎంవో ఆదేశానుసారం ప్రభుత్వాన్ని నడిపిస్తూ.. పాలనా సంబంధమైన వివరాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి అందించేలా మోడీ ఓ ప్రత్యేక ఐఏఎస్ అధికారిని సైతం నియమించడం గమనార్హం. 'అసాధారణ రీతిలో ఐఏఎస్ నృపేంద్రమిశ్రాను యూపీ పాలనా పర్యవేక్షకుడిగా నియమించడం చర్చనీయాంశంగా మారింది'.

ఇదే క్రమంలో పీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ మిశ్రా ఆదివారం నాడు సీఎం యోగితో దాదాపు 45నిమిషాల పాటు భేటీ అయ్యారు. దీంతో ఇకనుంచి సీఎం యోగికి, పీఎం మోడీకి మధ్య మిశ్రా దూతగా వ్యవహరిస్తారన్న సంకేతాలు వెలువెడ్డాయి. ఈ మేరకు జాతీయ మీడియా ఇండియా టుడే ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
కాగా, యూపీ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన నృపేంద్రమిశ్రాను 2014లో ప్రధాని మోడీ ఏరి కోరి కేంద్రానికి పిలిపించుకున్నారు. యూపీ ప్రభుత్వం ఇకముందు చేపట్టబోయే నియామకాలను సైతం మిశ్రానే ధ్రువీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications