ఈ గ్రామాలకు వెళ్తే వేరే గ్రహానికి వెళ్లినట్టే..! పర్యటకులు క్యూ..
భారత్ లో అనేక కట్టడాలు, చారిత్రక ప్రదేశాలు, ఆకాశ హర్మ్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో మనకు అనేక టూరిస్టు ప్రాంతాలు కనువిందు చేస్తాయి. అయితే దేశ సంస్కృతి , సంప్రదాయాలతోపాటు పచ్చని ప్రకృతి, ఆకట్టుకునే పల్లె అందాలు, కొండలు, కోనలు, సెలయేర్ల అందాలు చూడాలంటే గ్రామాల్లో పర్యటించాల్సిందే. దేశంలోని ఈ గ్రామాలకు వెళ్తే వేరే గ్రహంలోకి వెళ్లామా..? అన్న అనుభూతి కలుగుతుంది. ఆ విశేషాలు చూస్తే..
హిమాచల్ ప్రదేశ్ లోని మలానా గ్రామం పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కులు మనాలీ లోయలో దాగి ఉన్న ఈ గ్రామాన్ని లిటిల్ గ్రీస్ అని కూడా పిలుస్తుంటారు స్థానికులు. ఈ గ్రామంలో ఆచారాలు, సంప్రదాయాలు ఇతర ప్రదేశాలతో పోల్చితే భిన్నంగా ఉంటాయి. ఇక్కడి ప్రకృతి, వాతావరణం స్వర్గధామంగా ఉంటుంది. ఇక అరుణాచల్ ప్రదేశ్ లోని జిరో ప్రాంతం పర్యటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడి పైన్ చెట్లు, పచ్చని పంట పొలాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ గ్రామంలో అపతాని అనే ప్రత్యేకమైన తెగ ఉంటుంది. ఈ ప్రాంతంలోని ప్రశాంతమైన వాతావరణం, పచ్చదనం మరో ప్రపంచంలో ఉన్నామనే అనుభూతిని కలిగించడంలో సందేహం లేదు.
ఇక మేఘాలయ రాష్ట్రంలోని మావ్లినాంగ్ గ్రామానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ గ్రామాన్ని ఆసియా ఖండంలోనే స్వచ్చమైన గ్రామం అని పిలుస్తుంటారు. ఇక్కడి పల్లె సంస్కృతి, వాతావరణం అద్భుతంగా ఉంటుంది. అలాగే పూల తోటలు, జీవించి ఉన్న వేర్ల వంతెనలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అలాగే నాగాలాండ్ రాష్ట్రంలోని రోషోలి, ఖోనోమా గ్రామాలు కూడా పర్యటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆసియా ఖండంలోనే మొదటి గ్రీన్ విలేజ్ గా ఈ గ్రామాలు పేరుగాంచాయి. ఇక్కడి మెట్ల పొలాలు కనులవిందుగా ఉంటాయి.
అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని కల్పా గ్రామం ఆపిల్ తోటలకు ప్రసిద్ధి. అలాగే ఈ గ్రామం నుంచి హిమాలయ పర్వతాల దృశ్యం అద్భుతంగా ఉంటుంది. కిన్నౌర్ కైలాష్ పర్వత శ్రేణుల మధ్య ఉండే ప్రాంతం టూరిస్టులకు స్వర్గ ధామంగా ఉంటుంది. సిక్కింలోని లాచుంగ్ గ్రామం విశేషాలు చూస్తే.. మంచుతో కప్పబడిన పర్వతాలు, జలపాతాల మధ్య ఉండే ఈ గ్రామం స్విట్జర్లాండ్ ను తలపిస్తుంది. ఇక్కడి బౌద్ధ మఠాలు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయి.

అలాగే జమ్మూ కాశ్మీర్ లోని గంధేర్బల్ గ్రామం.. సింధ్ నది ఒడ్డున ఉంది. ఈ ప్రాంతం కాశ్మీర్ అందాలకు అసలైన నిదర్శనం. ఇక్కడి ప్రకృతి సౌందర్యం చూస్తే భూతల స్వర్గం అంటే ఇదేనా అన్న అనుమానం కలుగక మానదు. హిమాచల్ ప్రదేశ్ లోని చిట్కుల్ గ్రామం ఇండో-టిబెట్ సరిహద్దులో ఉంది. ఇది భారత దేశంలోనే చివరి గ్రామం కావడం విశేషం. ఇక్కడి స్వచ్ఛమైన గాలి, నీలి రంగు ఆకాశం కింద ఈ గ్రామం అద్భుతంగా దర్శనమిస్తుంది.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ?












Click it and Unblock the Notifications