రూ. 450కోట్ల అవినీతి ఆరోపణలు: అమూల్ ఎండీ రాజీనామా
ఆనంద్: అమూల్ పాల ఉత్పత్తి సంస్థ మేనేజింగ్ డైరక్టర్ కే రత్నం తన పదవికి రాజీనామా చేశాడు. శనివారం జరిగిన బోర్డు సమావేశంలో ఎండీ రాజీనామాకు చైర్మన్ రామ్సిన్ పర్మార్ ఆమోదం తెలిపారు.
గుజరాత్లోని ఆనంద్ నగరంలో ఉన్న అమూల్ పాల ఉత్పత్తుల సంస్థకు దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. అయితే డెయిరీలో జరిగిన అవినీతి, అవకతవకలకు ఆయనే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి.

టెండర్ల కేటాయింపు, రిక్రూట్మెంట్లో సుమారు 450 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేగాక, సంస్థ ఎండీ రత్నంపైనే ఆ ఆరోపణలు వచ్చాయి. అయితే, ఆ ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.
కేవలం ఫ్యామిలీ కారణాల వల్ల తాను రాజీనామా చేసినట్లు చెప్పారు. రాజీనామా చేసిన రత్నం స్థానంలో జనరల్ మేనేజర్ జేయన్ మెహతాను నూతన ఎండీ నియమిస్తున్నట్లు అమూల్ డెయిరీ ప్రకటించింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications