రూ. 450కోట్ల అవినీతి ఆరోపణలు: అమూల్ ఎండీ రాజీనామా
ఆనంద్: అమూల్ పాల ఉత్పత్తి సంస్థ మేనేజింగ్ డైరక్టర్ కే రత్నం తన పదవికి రాజీనామా చేశాడు. శనివారం జరిగిన బోర్డు సమావేశంలో ఎండీ రాజీనామాకు చైర్మన్ రామ్సిన్ పర్మార్ ఆమోదం తెలిపారు.
గుజరాత్లోని ఆనంద్ నగరంలో ఉన్న అమూల్ పాల ఉత్పత్తుల సంస్థకు దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. అయితే డెయిరీలో జరిగిన అవినీతి, అవకతవకలకు ఆయనే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి.

టెండర్ల కేటాయింపు, రిక్రూట్మెంట్లో సుమారు 450 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేగాక, సంస్థ ఎండీ రత్నంపైనే ఆ ఆరోపణలు వచ్చాయి. అయితే, ఆ ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.
కేవలం ఫ్యామిలీ కారణాల వల్ల తాను రాజీనామా చేసినట్లు చెప్పారు. రాజీనామా చేసిన రత్నం స్థానంలో జనరల్ మేనేజర్ జేయన్ మెహతాను నూతన ఎండీ నియమిస్తున్నట్లు అమూల్ డెయిరీ ప్రకటించింది.












Click it and Unblock the Notifications