జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి: సుబ్రమణ్యస్వామి డిమాండ్
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మెహబూబాపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సైన్యం పై కేసు నమోదు చేయడంపై సుబ్రమణ్య స్వామి మండిపడ్డారు.
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి సైన్యంపై కేసు పెట్టడంపై సుబ్రమణ్యస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం అర్ధం పర్ధం లేనిదిగా సుబ్రమణ్యస్వామి అభివర్ణించారు.

ఈ అంశంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోని. తక్షణమే కేసు వెనక్కి తీసుకోకపోతే.. విచక్షణ అధికారాలను ఉపయోగించి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు.
మెహబూబా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేబినెట్ నుంచి బయటకు వచ్చేందుకు బీజేపీ నేతలు సిద్ధం కావటం కలకలం రేపింది. అయితే అధిష్ఠానం సూచనలతో వారు వెనక్కి తగ్గినట్లు సమాచారం.
దక్షిణ కశ్మీర్ షోపియాన్ జిల్లాలోని గోవాంపురాలో శనివారం సైనిక వాహన శ్రేణిపై దాదాపు 250 మందికి పైగా నిరసనకారులు రాళ్లు రువ్వారు. సైన్యం నుండి ఆయుధాలు లాక్కొనేందుకు ప్రయత్నించారు. దీంతో సైన్యం కాల్పులకు దిగింది.
ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించమని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సైన్యాన్ని ఆదేశించారు. మరోవైపు కాల్పుల జరిపిన సైన్యంపై జమ్మూ కశ్మీర్ పోలీసులు కేసు నమోదుచేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications