8 ఏళ్ల బాలుడిని కొరికి చంపిన ఎలుగుబంటి.. ఎక్కడంటే..?
8 ఏళ్ల పిల్లాడిని ఎలుగుబంటి కొరికి చంపిన ఘటన తమిళనాడులోని వల్పరాయ్ లో జరిగింది. వల్పరాయ్ లోని ఓ టీ ఎస్టేట్ లో బాలుడి మృత దేహం లభ్యమైంది. ఎలుగుబంటి బాలుడి మృత దేహాన్ని సగం తిన్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ మేరకు డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వల్పరాయ్ గ్రామంలోని ఓ టీ ఎస్టేట్ లో విషాదం జరిగింది. ఓ 8 ఏళ్ల బాలుడిని ఎలుకు బంటి కొరికి చంపింది. అంతేకాక బాలుడి మృత దేహంలోని కొన్ని భాగాలను తినేసి వెళ్లిపోయింది. బాలుడ్ని నూర్ ఉల్ హక్(8) గా గుర్తించారు పోలీసులు.
బాలుడి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. అసోంకు చెందిన ఆ దంపతులు చాలా ఏళ్ల క్రితం వలస వచ్చి వల్పరాయ్ గ్రామంలోని ఓ టీ ఎస్టేట్ పనులు చేస్తున్నారు. అయితే ఆ దంపతుల కుమారుడు నూర్ ఉల్ హక్ కు 8 ఏళ్లు. రోజూలాగే పాలు తీసుకొచ్చేందుకు స్థానికంగా ఉన్న ఓ ఇంటికి వెళ్లి వస్తుండగా.. అప్పటికే పొదల్లో నక్కి ఉన్న ఎలుగుబంటి అమాంతం పిల్లాడి పైకి దూకి పొదల్లోకి లాక్కెల్లింది. బాలుడ్ని కొరికి చంపేసింది. అనంతరం కళ్లు, మెదడుని తిని వెళ్లిపోయింది.
అయితే నూర్ ఉల్ హక్ ఇంకా రాలేదని గ్రహించిన తల్లిదండ్రులు, స్థానికులు ఎస్టేట్ లో వెతకడం ప్రారంభించారు. అయితే దారిలో వాళ్లకు పాలు, రక్తం పడిన చోటు కనిపించింది. దీంతో అక్కడే పొదల్లోకి వెళ్లి చూడగా బాలుడి మృత దేహం లభ్యమైంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వాళ్లు వచ్చి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

గతంలోనూ ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. జూన్ నెలలో పాచమలై ఎస్టేట్ సమీపంలో ఆ ఘటన జరిగింది. కలియమ్మాల్ నివాస ప్రాంతంలో జార్ఖండ్ నుంచి వలస వచ్చిన దంపతులకు చెందిన నాలుగేళ్ల రోషిని కుమారని చిరుతపులి ఈడ్చుకెళ్లి చంపేసింది. ఇప్పుడు అలాంటి ఘటనే జరగడం ఇది రెండోసారి.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications