ఘోర రోడ్డు ప్రమాదం.. కుంభమేళా నుంచి వస్తూ ఆరుగురు భక్తులు మృతి
మధ్యప్రదేశ్ లోని జబల్ పుర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు, జీపు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. కర్ణాటకలోని బెలగావి జిల్లా ఘోకక్ మండలానికి చెందిన భక్తులు.. మహా కుంభమేళాలోని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి తిరిగి వస్తున్న క్రమంలో ప్రైవేట్ బస్సు, జీపు ఒకదానికొకటి ఢీకొన్నాయి. జబల్ పుర్ లోని ఫారేవా గ్రామం, కితౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
జబల్ పుర్ కలెక్టర్ దీపక్ సక్సేనా తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని బెలగావికి చెందిన జీపు అదుపుతప్పి డివైడర్ వద్ద ఉన్న చెట్టును ఢీకొట్టింది. అమాంతం గాలిలోకి ఎగిరి వ్యతిరేక దిశలో వస్తున్న ట్రావెల్ బస్సును ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి.. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం జబల్ పూర్ కు తరలించారు. ఈ ఘటన అనంతరం ట్రావెల్ బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం.

సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలికి జిల్లా కలెక్టర్, ఎస్పీ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
13 మంది సజీవ దహనం, మార్కాపురంలో మృత్యుఘోష.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications