పేలుళ్ల ఉగ్రవాది.. బాంబు పెట్టి సెల్ఫీ: బంగారం స్వాధీనం, ఎవరీ అతీఫ్?
మధ్యప్రదేశ్లో భోపాల్ - ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో పేలుడుకు పాల్పడిన ముష్కరుడు సైఫుల్లాను హతమార్చినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. సంఘటన స్థలం నుంచి బాంబు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు
లక్నో: మధ్యప్రదేశ్లో భోపాల్ - ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో పేలుడుకు పాల్పడిన ముష్కరుడు సైఫుల్లాను హతమార్చినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. సంఘటన స్థలం నుంచి బాంబు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సైఫుల్లా మృతి చెందాడని చెప్పిన పోలీసులు
సైఫుల్లా ఎదురు కాల్పుల్లో మృతి చెందారన్నారు. అతనికి లొంగిపోయేందుకు చాలా సమయం ఇచ్చామని తెలిపారు. నిందితులు స్వచ్చంధంగా ఐసిస్ వైపు వెళ్లారన్నారు. సంఘటన స్థలం నుంచి 8 పిస్టల్స్, 600 క్యాట్రిడ్జులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భారీగా బంగారం, నగదు, 3 పాస్ పోర్టులు గుర్తించినట్లు చెప్పారు.

సూత్రధారి సెల్ఫీ!
మరోవైపు, రైలులో బాంబు పెట్టిన సూత్రధారి అతిఫ్ ముజఫర్.. దాంతో ఫొటో తీసుకుని, ఇతరులకు పంపించాడు. భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో మంగళవారం ఉదయం జరిగిన పేలుడుకు సూత్రధారి అతిఫ్ ముజఫర్ రాక్షసత్వం కలిగినవాడు.

ఖోరసాన్ మాడ్యుల టెర్రర్ సంస్థ చీఫ్.. ఐసిస్కు లింక్
మీడియాలో వస్తున్న వార్తల మేరకు.. ఖొరసాన్ మాడ్యూల అనే ఉగ్రవాద బృందానికి అతిఫ్ ముజఫర్ నాయకత్వం వహిస్తున్నాడు. దీనికి తనను తాను చీఫ్గా ప్రకటించుకున్నాడు. ఇది ఐసిస్ ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పని చేస్తోంది.

భారీ దాడులే లక్ష్యం
తొమ్మిది మంది సభ్యులు గల ఖొరసాన్ మాడ్యూల్ కార్యకలాపాలు ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో జరుగుతున్నాయి. కొత్తగా ఫైటర్లను చేర్చుకుని, మరింత విస్తరించి, ఈ ప్రాంతంలో భారీ దాడులు చేయాలన్నది ఖొరసాన్ లక్ష్యం.

ప్రత్యేక శైలిలో..
ఈ సంస్థ కార్యకలాపాలు ప్రత్యేక శైలిలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. అలీగఢ్కు చెందిన అతిఫ్ ముజఫర్కు అల్ ఖాసిం అనే పేరు కూడా ఉంది. అతను ఇంజినీరింగ్ చదివాడు.

అరెస్ట్
అతనితో పాటు ఉజ్జయిని రైలులో టైమర్ పైప్ బాంబ్ను అమర్చిన డానిష్ అక్తర్, సయ్యద్ మిర్ హుస్సేన్లను మంగళవారం మధ్యాహ్నం 1.30గంటలకు మధ్యప్రదేశ్ ఏటీఎస్ అరెస్టు చేసింది.

ఫోన్లో ఆధారాలు
హోషంగాబాద్ జిల్లాలోని పిపరియా వద్ద బస్సు నుంచి దిగుతుండగా వీరు పట్టుబడ్డారు. అతిఫ్ వద్దనున్న మొబైల్ ఫోన్ను పరిశీలించినపుడు విలువైన ఆధారాలు పోలీసులకు లభించాయి.

ఫోటోలు తీసుకొని పంపించాడు..
రైలులో బాంబును అమర్చుతూ ఫొటో తీసుకుని, కొందరికి పంపించేందుకు ఈ మొబైల్ ఫోన్ను వాడినట్లు పోలీసులు తెలిపారు. ఖొరసానాకు డిప్యూటీ కమాండర్లుగా డానిష్, మహ్మద్ సైఫుల్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

మృతి చెందాడు
వీరిలో సైఫుల్ మంగళవారం ఉత్తరప్రదేశ్లోని ఠాకూర్గంజ్లో ఏటీఎస్ దాడిలో మరణించాడు. రష్యన్ డెవలపర్ రూపొందించిన టెలిగ్రామ్ అనే మెసేజింగ్ యాప్లో యూజర్ల ప్రైవసీకి గట్టి భద్రత ఉంటుంది. ఇస్లామిక్ ఉగ్రవాదులు అత్యధికంగా ఈ యాప్నే ఉపయోగించుకుంటున్నారు. ఖొరసానా ముఠా కూడా ఈ యాప్నే వాడుతున్నట్లు తెలుస్తోంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications