జంతువు కంటే హీనంగా చూస్తున్నారు: యాసిన్ భత్కల్
న్యూఢిల్లీ: దేశంలో వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అయిన ఉగ్రవాది, ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ తనను తీహార్ జైల్లో జంతువు కంటే హీనంగా చూస్తున్నారని సోమవారం న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చాడు.
పవిత్ర రంజాన్ మాసంలో కూడా సరైన ఆహారం ఇవ్వడం లేదని ఆరోపించాడు. గాలీ, వెలుతురు రాని చోట ఏకాంతంగా ఖైదు చేశారనీ, న్యాయస్థానానికి తీసుకువస్తున్నప్పుడే తాను వెలుతురు చూస్తున్నానని తన న్యాయవాది ద్వారా న్యాయస్థానం ముందు వెల్లడించాడు.

కాగా, దీనిపై బుధవారం నివేదికను సమర్పించాల్సిందిగా అదనపు సెషన్స్ న్యాయమూర్తి రాజ్కపూర్ తీహార్ జైలు అధికారులను ఆదేశించారు. యాసిన్ భత్కల్, అతని సహచరుడు అసదుల్లా అక్తర్లను నిరుడు ఆగస్టు 28న భారత్-నేపాల్ సరిహద్దులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేశారు.
మహారాష్ట్రలోని ముంబైలో 21 మంది మృతికి కారణమైన 2011 నాటి వరుస పేలుళ్లకు పాల్పడినందుకు తాను గర్వపడుతున్నట్లు యాసిన్ భత్కల్ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ‘పేలుళ్లకు పశ్చాత్తాపడటం లేదు. నా దృష్టిలో అవి నేరం కాదు. అందుకే వాటికి పాల్పడ్డానని ఒప్పుకుంటూ వాంగ్మూలం ఇవ్వదలుచుకున్నా' అని ముంబై పోలీసులకు ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలంలో భత్కల్ చెప్పాడు. అతడి సహాయకుడు అసదుల్లా అక్తర్ కూడా పేలుళ్లకు పాల్పడినందుకు చింతించడం లేదని నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications