రేప్ వ్యాఖ్యలు: తపస్పాల్పై కేసు నమోదుకు కోర్టు ఆర్డర్

ఇటీవల తమ పార్టీ కార్యకర్తల సమావేశంలో తపస్ మాట్లాడుతూ.. తమ వాళ్లను బెదిరిస్తే తాను చూస్తూ ఊరుకోనని.. మీ(సిపిఎం) పార్టీ మహిళలను అత్యాచారం చేయాలని మా కార్యకర్తలకు పిలుపునిస్తానని అన్నారు. కోల్కాతాలో సిపిఎం కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలపై వివాదం రేగింది.
ఇది ఇలా ఉండగా మరోసారి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తపస్ పాల్. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల గొంతులు కోయండని ఆయన తన మద్దతుదారులకు పిలుపునిచ్చారు. తానే స్వయంగా వారిని కాల్చి చంపుతానని హెచ్చరించారు. ఆ వీడియో ఫుటేజీ ఓ మీడియాలో ప్రసారం కావడంతో తపస్ పాల్పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.
కాగా, తాను రేప్ చేయిస్తానని చెప్పలేదని, రెయిడ్ (సోదాలు) చేయిస్తానని మాత్రమే చెప్పానని తపస్ పాల్ వివరణ ఇచ్చారు. మరోవైపు, ఈ విషయమై తపస్ పాల్పై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా.. "అతని విషయంలో నేనేం చేయాలని మీరు అనుకుంటున్నారు, అతన్ని చంపేయాలా?" అని ఆమె మీడియా వద్ద మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అయితే నడియా జిల్లాకు చెందిన బిప్లాబ్ చౌదరి అనే వ్యక్తి పాల్పై చర్యలు తీసుకోవాలని, తనకు అతడి మద్దతుదారుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంతో కోర్టు సోమవారం తపస్ పాల్పై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications