ఎన్నికల ఫలితాల వేళ విషాదం: 6సార్లు ఎమ్మెల్యే, త్రిపుర మంత్రి ఖగేంద్ర కన్నుమూత
న్యూఢిల్లీ/ అగర్తాల: త్రిపుర రాష్ట్ర మత్స్య, కార్పొరేషన్ శాఖల మంత్రి, సీపీఎం నేత ఖగేంద్ర జమాటియా(64) కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్న ఖగేంద్ర న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందారు. ఈ విషయాన్ని త్రిపుర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పవిత్రా కౌర్ వెల్లడించారు.
ఖగేంద్ర భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి స్వస్థలానికి తరలించనున్నారు. త్రిపుర అసెంబ్లీకి గత ఫిబ్రవరి 18న ఎన్నికలు జరగగా.. ఆ మరుసటిరోజే ఖగేంద్ర తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను తొలుత గోవింద బల్లావ్ పంత్ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ఫిబ్రవరి 25న న్యూఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించి చికిత్స అందించారు.

వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలకావడం కావడంతో మంత్రి ఖగేంద్ర కన్నుమూశారని సీపీఎం అధికార ప్రతినిధి గౌతం దాస్ వెల్లడించారు. కాగా, ఖగేంద్ర జమాటియా 1983లో సీపీఎంలో చేరారు.
ఇటీవల జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో క్రిష్ణాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఖగేంద్ర.. 1988 నుంచి ఆరుసార్లు వరుసగా ఎన్నికల్లో విజయం సాధించారు. రెండు పర్యాయాలు త్రిపుర కేబినెట్లో మంత్రిగా సేవలందించారు. శనివారం త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడుతున్న వేళ ఖగేంద్ర మరణం సీపీఎం శ్రేణుల్లో విషాదం నింపింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications