కొత్త ఉప ముఖ్యమంత్రిగా: ప్రతిపాదనలను ఆమోదించిన ఖర్గే
రాయ్పూర్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఊపులో ఉంది కాంగ్రెస్ పార్టీ. అదే జోరును తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే రాష్ట్రాల్లోనూ కొనసాగించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది. వాటిని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడానికి అవసరమైన సంప్రదింపులు జరుపుతోంది.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కసరత్తును కూడా కాంగ్రెస్ మొదలుపెట్టింది. దీనితో కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల హడావుడి నెలకొంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో వరుస భేటీలు ఏర్పాటవుతున్నాయి.

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నాయకులు ఈ అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార సమరశంఖాన్ని పూరించడానికి సన్నద్ధమౌతోన్నారు. త్వరలో ఆయా రాష్ట్రాల్లో పర్యటించడానికి సన్నద్ధమౌతోన్నారు. జూలై 2వ తేదీన ఖమ్మంలో నిర్వహించిన జన గర్జన సభలో పాల్గొనబోతోన్న రాహుల్ గాంధీ.. పొరుగునే ఉన్న ఛత్తీస్గఢ్కూ వెళ్లనున్నారు.
రాయ్పూర్లో బహిరంగ సభను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఛత్తీస్గఢ్లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన చర్యలను తీసుకుంటోంది కాంగ్రెస్. ఇందులో భాగంగా ఆ రాష్ట్రానికి కొత్తగా ఉప ముఖ్యమంత్రిని అపాయింట్ చేసింది. కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

సీనియర్ నాయకుడు టీఎస్ సింగ్ దేవ్ను ఉప ముఖ్యమంత్రిగా అపాయింట్ చేసినట్లు వెల్లడించారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు. సింగ్ దేవ్ను డిప్యూటీ సీఎంగా అపాయింట్ చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను మల్లికార్జున ఖర్గే ఆమోదించారు. ఆ వెంటనే దీనికి సంబంధించిన జీఓ విడుదలైంది.
టీఎస్ సింగ్ దేవ్ సొంత నియోజకవర్గం అంబికాపూర్. 2008,2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారాయన. ప్రస్తుతం భూపేష్ బఘేల్ మంత్రివర్గంలో కీలకమైన వైద్యారోగ్య శాఖను పర్యవేక్షిస్తోన్నారు. ఆయన స్థానాన్ని ఉప ముఖ్యమంత్రి హోదాగా మార్చడానికి కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరించింది.
-
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ?












Click it and Unblock the Notifications