రిసార్ట్ కు రెబల్ ఎమ్మెల్యేలు: పన్నీర్, పళని దెబ్బతో పొరుగు రాష్ట్రానికి పారిపోయారు !
తమిళనాడులో మళ్లీ రిసార్ట్ రాజకీయాలు మొదలైనాయి. అయితే ఇప్పుడు తమిళనాడులో వీకే శశికళ నటరాజన్ లేకపోవడం, పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శిక్ష .
చెన్నై: తమిళనాడులో మళ్లీ రిసార్ట్ రాజకీయాలు మొదలైనాయి. అయితే ఇప్పుడు తమిళనాడులో వీకే శశికళ నటరాజన్ లేకపోవడం, పొరుగు రాష్ట్రం కర్ణాటక రాజధాని బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శిక్ష అనుభవిస్తున్నందున మన్నార్ గుడి మాఫియా రంగంలోకి దిగింది.
తమిళనాడు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వం: గవర్నర్ కు లేఖ ఇచ్చిన 19 మంది ఎమ్మెల్యేలు !
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వానికి తాము మద్దతు ఇవ్వడం లేదని 19 మంది ఎమ్మెల్యేలు అధికారికంగా లేఖ ఇవ్వడంతో టీటీవీ దినకరన్, మన్నార్ గుడి మాఫియా దూకుడు పెంచింది. తమ వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు మళ్లీ చెయ్యిజారిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
19 మంద రెబల్ ఎమ్మెల్యేలను రిసార్ట్ కు తరలించాలని ప్లాన్ వేశారు. తమిళనాడులోని రిసార్ట్ లో ఉంటే పన్నీర్ సెల్వం, పళనిసామి పలుకుబడి ఉపయోగించి ఎమ్మెల్యేలను రిసార్ట్ నుంచి బయటకు తీసుకు వచ్చే అవకాశం ఉందని మన్నార్ గుడి మాఫియా భయపడుతోంది.
బెంగళూరు జైల్లో శశికళ, దర్జాగా షాపింగ్, దెబ్బతో ఐపీఎస్ అధికారిపై వేటు !
పన్నీర్, పళని దెబ్బతో పోరుగు రాష్ట్రం అయిన పుదుచ్చేరికి మకాం మార్చారు. బస్సులో ఎమ్మెల్యేలను తీసుకు వెళితే తమిళనాడు రాష్ట్రం దాటకుండానే పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గాలు వారిని అడ్డుకునే అవకాశం ఉందని అనుమానంతో ఎమ్మెల్యేలను ప్రైవేట్ కార్లలో పుదుచ్చేరికి తీసుకు వెలుతున్నారు. మొత్తం మీద దినకరన్, మన్నార్ గుడి మాఫియా తమిళనాడు ప్రభుత్వానికి సినిమా చూపించాలని మళ్లీ రిసార్ట్ రాజకీయాలు మొదలు పెట్టారు.