టర్కీ-సిరియా భూకంపం: శిథిలాల కింద ఆచూకీ లేని భారతీయ వ్యాపారవేత్త మృతదేహం లభ్యం
టర్కీ-సిరియా భూకంపంలో ఓ భారతీయుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది.
న్యూఢిల్లీ: టర్కీ-సిరియాలో ఇటీవల సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని నింపింది. ఈ రెండు దేశాల్లో భూకంపం కారణంగా ఇప్పటి వరకు 25వేల మందికిపైగా మరణించారు. లక్ష మంది వరకు గాయాలపాలయ్యారు. ఇప్పటికీ భవన శిథిలాల నుంచి క్షతగాత్రులను, మృతులను బయటికి తీస్తున్నారు. కాగా, ఈ భూకంపంలో ఓ భారతీయుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది.
We inform with sorrow that the mortal remains of Shri Vijay Kumar, an Indian national missing in Turkiye since February 6 earthquake, have been found and identified among the debris of a hotel in Malatya, where he was on a business trip.@PMOIndia @DrSJaishankar @MEAIndia
— India in Türkiye (@IndianEmbassyTR) February 11, 2023
1/2
టర్కీలోని మాలత్య నగరంలో భూకంప ప్రభావిత ప్రాంతం నుంచి బయటికి తీసిన మృతుడిని ఉత్తరాఖండ్కు చెందిన విజయ్ కుమార్గా గుర్తించారు. ఆయనో వ్యాపారవేత్త అని, బిజినెస్ ట్రిప్ మీద మాలత్యకు వచ్చినట్లు అక్కడి భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది. భూకంప ఘటన జరిగిన నాటి నుచి ఆచూకీ లేకుండా పోయారని, తాజాగా, ఇక్కడి ఓ హోటల్ శిథిలాల్లో ఆయన మృతదేహం లభించినట్లు వెల్లడించింది.

మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ.. భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా భారత్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. కాగా, విజయ్ కుమార్ మృతి చెందాడని తెలిసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Uttarakhand | Family of Vijay Kumar mourns his demise, at their residence in Kotdwar. His body was found among the debris of a hotel in Malatya, Turkey where he was on a business trip. He's survived by his mother, wife & 6-year-old child
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 11, 2023
A powerful earthquake hit Turkey on Feb 6 pic.twitter.com/y4c5f8DRID
ఇది ఇలావుండగా, ఫిబ్రవరి 6న సంభవించిన భారీ భూకంపం టర్కీ, సిరియాలోని వేలాది కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఇప్పటికే 25వేల మందికిపైగా మరణించారు. లక్ష మంది వరకు క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ప్రస్తుతం భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అతి శీతల పరిస్థితులు నెలకొన్నాయి. గడ్డకట్టే చలిలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో శిథిలాల కింద మరికొంతమంది చనిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications