Twitter: అనూహ్య నిర్ణయం -భారత్లో గ్రీవెన్స్ అధికారిగా అమెరికన్ జెరెమీ కెసెల్ -కొత్త ఐటీ రూల్స్కు విరుద్ధం
భారత ప్రభుత్వంతో విభేదాలను మరింత పెద్దవి చేస్తూ ప్రఖ్యాత మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విటర్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాల అమలు విషయంలో వివాదాస్పదంగా వ్యవహరిస్తోన్న ట్విటర్.. మరోసారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది. ఇండియాలో గ్రీవెన్స్ అధికారిగా ఓ అమెరికన్ ను నియమించడం ద్వారా ట్విటర్ తలబిరుసును ప్రదర్శించింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఐటీ నిబంధనల ప్రకారం యూజర్ల సంఖ్య 50 లక్షలుదాటితే సోషల్ మీడియా సంస్థలు ఫిర్యాదుల పరిష్కారానికి ఓ అధికారిని నియమించి, ఆ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆ అధికారి తప్పనిసరిగా ఇండియాలో నివాసం ఉండే వ్యక్తై ఉండాలి. కానీ ట్విట్టర్ తీసుకున్న తాజా నిర్ణయం ఈ నిబంధనకు పూర్తి వ్యతిరేకంగా ఉంది.

అమెరికాకు చెందిన జెరెమీ కెసెల్ అనే ఉద్యోగిని ఇండియాలో గ్రీవెన్స్ అధికారిగా ట్విట్టర్ నియమించింది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని కార్యాలయంలో పనిచేస్తోన్ జెరెమీ ట్విటర్ గ్లోబల్ లీగల్ పాలసీ డైరెక్టర్గా ఉన్నారు. కాగా, ట్విటర్ ఇండియా గ్రీవెన్స్ అధికారికిగా అమెరికన్ ను నియమించడంతో ఈ నియామకాన్ని భారత ప్రభుత్వం అంగీకరించలేదు.
కేంద్రం, ట్విటర్ మధ్య కొంత కాలంగా విభేదాలు తారాస్థాయికి చేరిన దరిమిలా ట్విటర్ ఇండియా తాత్కాలిక గ్రీవెన్స్ అధికారిగా ఉన్న ధర్మేంద్ర చతుర్ ఆదివారం రాజీనామా చేయడం కూడా సంచలనంగా మారింది. బాధ్యతలు తీసుకుని నెల కూడా తిరక్క ముందే ధర్మేంద్ర రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జెరెమీ కెసెల్ కు ఇండియాలో గ్రీవెన్స్ అధికారిగా బాధ్యతలు అప్పగించారు.
ట్విటర్ వంటి దిగ్గజ సంస్థలు గ్రీవెన్స్ అధికారితోపాటు ఓ నోడల్ అధికారి, స్థానిక ఫిర్యాదుల అధికారిని కూడా నియమించాలసి ఉంటుంది. ఈ అధికారులంతా భారత్లో నివసించేవారై ఉండాలి. దీనికి విరుద్ధంగా అమెరికా ఉద్యోగిని నియమించడంతో కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య మరోసారి వివాదం తలెత్తనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, జమ్మూకాశ్మీర్, లదాక్ లను వేరే దేశాలుగా పేర్కొంటూ ట్విటర్ సంస్థ తాజాగా ప్రచురించిన ఇండియా మ్యాప్ ఉదంతంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications