ట్విట్టర్-కేంద్రం మంటలు: వైదొలిగిన ట్విటర్ గ్రీవెన్స్ అధికారి!
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త డిజిటల్ నిబంధనలకు అనుగుణంగా భారత్లో ట్విట్టర్ నియమించిన తాత్కాలిక గ్రీవెన్స్ ఆఫీసర్ ధర్మేంద్ర చతుర్ తన పదవి నుంచి వైదొలిగారు. దీంతో ఆ పదవి ఖాళీ అయినట్లయింది. నిబంధనల ప్రకారం.. ఆ పదవి ఖాళీగా ఉండేందుకు వీలు లేదు. దీనిపై స్పందించడానికి ట్విట్టర్ నిరాకరించింది.
ట్విట్టర్, కేంద్ర ప్రభుత్వం మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన కొత్త డిజిటల్ నిబంధనల అమలులో ట్విట్టర్ జాప్యం చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్రం ట్విట్టర్కు ఉన్న మధ్యవర్తిత్వ హోదాను రద్దు చేసింది. దీంతో వినియోగదారుల పోస్టులకు ట్విట్టర్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఇటీవల యూపీలో ట్విటర్పై కేసు కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఐటీశాఖ మంత్రి ట్వీట్ అకౌంట్ గంటపాటు నిలిచిపోయింది. ఈ విషయాన్ని ఆయనే ట్వీట్ ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. కొత్త ఐటీ రూల్స్ మధ్య.. ట్విట్టర్, కేంద్రానికి మధ్య విభేదాలు తలెత్తాయి.












Click it and Unblock the Notifications