ఎన్కౌంటర్: మేజర్, జవాను మృతి, ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ ఉగ్రవాదులు మళ్లీ తెగబడ్డారు. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ మేజర్ తోపాటు ఓ జవాను మృతి చెందారు. షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య గురువారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ కాల్పుల్లో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. అందులో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జైపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్న బలగాలపైకి ఉగ్రవాదులు తెగబడ్డారని, ఇంకా కాల్పులు జరుగుతున్నాయని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
కాగా, కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల దాడిని సైనికులు బలంగా తిప్పికొట్టారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరోవైపు సోషియాన్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు జవాను మృతిచెందారు. తాజా, ఘటనల నేపథ్యంలో సైన్యం మరింత అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టింది.