వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లడాఖ్లో భూకంపం: గంట వ్యవధిలో రెండుసార్లు కంపించిన భూమి..
లడాఖ్లో భూకంపం వచ్చింది. శుక్రవారం సాయంత్రం 4.27 గంటలకు తొలిసారి భూ ప్రకంపనాలు వచ్చాయి. తర్వాత 5.29 గంటలకు కూడా భూమి కంపించింది. తొలిసారి భూమి కంపించిన సమయంలో రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 5.4గా ఉంది. రెండోసారి 3.6గా ఉంది అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలాజీ ప్రకంటిచింది.
రెండుసార్లు భూమి కంపించిన సమయంలో భూకంప తీవ్రత 10 కిలోమీటర్ల లోతు వరకు ప్రభావం చూపించింది. వాస్తవానికి హిమాలయ ప్రాంతంలో భూంకపాలు తరచూగా వస్తుంటాయి. అలాగే శుక్రవారం కూడా రెండుసార్లు భూకంపం వచ్చింది.
Comments
English summary
Two medium-intensity earthquakes of magnitudes 5.4 and 3.6 hit the Ladakh region on Friday, the National Centre for Seismology said.
Story first published: Friday, September 25, 2020, 21:27 [IST]