ఎన్ కౌంటర్: కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదులు, సైనికుల మద్య జరుగుతున్న పోరులో ఇద్దరు ఉగ్రవాదులు అంతమయ్యారు. ఇదే సమయంలో ఒక సామాన్యుడు బలి కావడంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. మృతదేహం తీసుకు వెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టి ధర్నా నిర్వహించారు.
మిలటరి బలగాల మీద రాళ్ల వర్షం కురిపించారు. ఆదివారం అర్దరాత్రి ఉగ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం తెలుసుకున్న మిలటరి బలగాలు కుల్లాంగ జిల్లా రెద్వాని బాలా గ్రామంలో సోదాలు చేపట్టారు. అదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
మిలటరి బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఇద్దరు ఉగ్రవాదులు అంతం అయ్యారు. ఈ సందర్బంలో బుల్లెట్ లు ఆవీఫ్ రషీద్, బిలాల్ అహమ్మద్ అనే ఇద్దరి శరీరంలో దూసుకు వెళ్లాయి. తీవ్రస్థాయిలో రక్తం పోవడంతో రషీద్ మరణించాడు. బిలాల్ అహమ్మద్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం చుట్టు పక్కల ఉన్న గ్రామస్తులు పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకుని ధర్నా నిర్వహించారు. అక్కడికి వెళ్లిన మిలటరి బలగాల మీద రాళ్ల వర్షం కురిపించారు. ముందు జాగ్రత చర్యగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.