వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీర్ గూటికి ఎమ్మెల్యేలు పరుగో పరుగు: చిన్నమ్మ వద్దంటూ!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో శశికళ వ్యతిరేక వర్గం గంట గంటకు పెరిగుతోంది. తాజాగా గురువారం సాయంత్రం అన్నాడీఎంకేకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోయారని వెలుగు చూసింది.

<strong>గవర్నర్ ఫస్ట్ చాన్స్ పన్నీర్ సెల్వంకే ఇచ్చారు: సగం విజయం, శశికళకు!</strong>గవర్నర్ ఫస్ట్ చాన్స్ పన్నీర్ సెల్వంకే ఇచ్చారు: సగం విజయం, శశికళకు!

అంతలోనే శశికళ నాయకత్వాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేతలు ఆమె మీద విరుచుకుపడుతున్నారు. వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి శశికళ తీరుపై విమర్శలు చేస్తున్నారు. అయితే శశికళ వర్గీయులు మాత్రం పైకి గొప్పలు చెప్పుకుంటున్నారు.

Two more AIADMK MLAs will support to the Chief Minister TN CM Panneerselvam.

అన్నాడీఎంకే పార్టీకి చెందిన 130 మంది ఎమ్మెల్యేలు మాకే మద్దతు ఇస్తున్నారని శశికళ వర్గీయులు అంటున్నారు. అయితే గురువారం ఉదయం పన్నీర్ సెల్వంకు మద్దతు ఇచ్చిన 22 మంది ఎమ్మెల్యేల విషయంలో శశికళ వర్గీయులు మాత్రం నోరు మెదపడంలేదు.

<strong>శశికళకు షాక్: మెరీనా బీచ్ సాక్షిగా మరో పోరాటం: యువత వార్నింగ్ !</strong>శశికళకు షాక్: మెరీనా బీచ్ సాక్షిగా మరో పోరాటం: యువత వార్నింగ్ !

గురువారం మద్యాహ్నం అన్నాడీఎంకే పార్టీ ప్రిసీడియం చెర్మన్ మదుసూధనన్ వెంట వెళ్లిన ఇద్దరు ఎమ్మెల్యేలు, సాయంత్రం పన్నీర్ గూటికి చేరిన మరో ఇద్దరు ఎమ్మెల్యేల విషయం గురించి మీడియా ప్రశ్నిస్తే అవంతా పుకార్లు అంటూ శశికళ వర్గీయులు కొట్టిపారేస్తున్నారు.

English summary
Sources said that Two more AIADMK MLAs will support to the Tamil Nadu Chief Minister O Panneerselvam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X