నిట్ చరిత్రలోనే తొలిసారి: ఇద్దరు విద్యార్ధులకు రూ. 67 లక్షల వేతనం
న్యూఢిల్లీ: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతోన్న ఇద్దరు భారతీయ విద్యార్ధులకు అమెరికా కంపెనీలు ఏడాదికి లక్ష డాలర్ల వేతనం చెల్లించేందుకు అంగీకరించాయి. ప్రస్తుతం జంషెడ్పూర్లోని నిట్లో జరుగుతోన్న ప్లేస్ మెంట్స్లో ఇద్దరు విద్యార్ధులు ఈ ప్యాకేజీని పొందారు.
నిట్ ప్లేస్మెంట్ ఆఫీసర్, ఫ్రొపెసర్ ఇన్ ఛార్జి డాక్టర్ రాజీవ్ భూషణ్ మాట్లాడుతూ అమెరికాకి చెందిన ఎపిక్ సిస్టమ్స్ అనే కంపెనీ బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదవుతున్న కిష్జిత్ గుప్తా, ఆలీ జాహిర్ అనే విద్యార్ధులకు సంవత్సరానికి గాను రూ. 67 లక్షల వేతనాన్ని ఆఫర్ చేసినట్లు తెలిపారు.

ఇప్పటి వరకు నిట్, జంషెడ్పూర్లో ఇదే అత్యధిక వేతనమని ఆయన పేర్కొన్నారు. ఇక ఎపిక్ సిస్టమ్స్ కార్పోరేషన్ అమెరికాలో హెల్త్ కేర్ డొమైన్ రంగంలో అగ్రగామిగా ఉంది. ఇక జపాన్కు చెందిన మరో కంపెనీ శుభమ్ సతీష్ బాల్దావా (కంప్యూటర్స్ సైన్స్ విభాగం), భఱత్ సింగ్ భండారి (ఎలక్ట్రానిక్స్ విభాగం)కు చెందిన విద్యార్ధులకు రూ. 32 లక్షల వేతనాన్ని ఆఫర్ చేసిందన్నారు.
గత ఏడాది జపాన్కు చెందిన వర్క్ అప్లికేషన్స్ అనే కంపెనీ అత్యధికంగా రూ. 25 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసిందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్లేస్ మెంట్స్లో 600 మంది విద్యార్ధులు జాబ్ ఆఫర్లను పొందారని అన్నారు. ఈ ఏడాది ప్లేస్మెంట్స్ జూన్ 2015 వరకు జరగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications