దారుణం: ఆస్తి కోసం తండ్రిపై కొడుకుల కిరాతకం
బెంగుళూరు: ఆస్తికోసం కన్నతండ్రిని కిరాతకంగా హింసించారు కొడుకులు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బగల్కోట జిల్లాలోని నింగాపూరలో చోటుచేసుకొంది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
కర్నాటకలోని బగల్కోట జిల్లా నింగాపూర గ్రామానికి చెందిన షేకప్ప మనగూళికి ఇద్దరు కొడుకులు. ఆయనకు భూమి, ఇల్లు ఉన్నాయి. అయితే ఆస్తి మొత్తం ఆయనపేరునే ఉంది. అయితే ఆస్తులు పంచాలని కొడుకులు కన్నప్ప, ఎల్లప్ప కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు.
అయితే తాను చనిపోయిన తర్వాత ఆస్తులు పంచుకోవాలని తండ్రి కొడుకుల తేగేసి చెప్పారు.దీంతో కొడుకులిద్దరూ తండ్రి మంగోలిని ఇంట్లోనుండి బయటకు తీసుకువచ్చి విపరీతంగా కొట్టారు.
ఓ కొడుకు కాళ్ళు పట్టుకొంటే , మరో కొడుకు చేతులు పట్టుకొని మీరా కొట్టారు. గ్రామస్థులంతా దీన్ని వింతగా చూశారు. అయితే ఈ దాడి జరుగుతున్న సమయంలో కొందరు యువకులు ఈ దృశ్యాలను వీడియోతీసీ సోషల్మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. అంతేకాదు పోలీసులకు కూడ ఫిర్యాదుచేశారు. దీంతో ఇధ్దరు కొడుకులను పోలీసులు అరెస్ట్ చేశారు.