ఐపీల్ క్రికెట్ బెట్టింగ్: ఆన్ లైన్ లో దందా: కింగ్ పిన్ అరెస్టు !
కర్ణాటకలోని హుబ్బళిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బెట్టింగ్ నిర్వహిస్తున్న కింగ్ పిన్ గజానన కఠార్ తో సహ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి లైవ్ మిషన్, భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు.
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని కర్ఱాటక పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటకలోని హుబ్బళి కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు.
హుబ్బళిలోని కేశ్వాపుర ప్రాంతంలోని ఇంటిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసు అధికారులకు సమాచారం అందింది. శుక్రవారం పోలీసులు ఇంటిపై దాడి చేశారు. ఆన్ లైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు.
గజానన కఠార్, రాఘవేంద్ర అనే ఇద్దరు కేశ్వాపురలోని ఇంటి నుంచి ఆన్ లైన్ లో ఐపీఎస్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసు అధికారులు చెప్పారు. గజానన కఠార్ గతంలో అనేక సార్లు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అరెస్టు అయ్యాడని పోలీసులు అన్నారు.
జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలైన గజానన కఠార్ మళ్లీ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని పోలీసు అధికారులు చెప్పారు. ఐపీఎల్ బెట్టింగ్ కింగ్ పిన్ గజానన కఠార్ అని పోలీసులు అన్నారు. నిందితుల నుంచి లైవ్ మిషన్, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నామని హుబ్బళి పోలీసు అధికారులు తెలిపారు.