ఐదోసారి: నీరవ్ మోడీకి యూకే కోర్టులో చుక్కెదురు
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో కేసులో కీలక నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి మరోసారి యూకే కోర్టులో చుక్కెదురైంది. పీఎన్బీ స్కాం కేసులో లండన్లో నీరవ్ మోడీ అరెస్టయిన విషయం తెలిసిందే. బెయిల్ కోసం ఆయన చేసుకున్న దరఖాస్తును యూకే కోర్టు మరోసారి తిరస్కరించింది.
పీఎన్బీ కేసు సంబంధించి ఈ ఏడాది మార్చి 19న లండన్ పోలీసులు నీరవ్ మోడీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నీరవ్ మోడీ బెయిల్ దరఖాస్తును యూకే కోర్టు ఇప్పటికే నాలుగు సార్లు తిరస్కరించింది.
అయినా, మరోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు ఈ స్కాం నిందితుడు. తాను తీవ్ర మానసిక ఒత్తిడి, నిరాశకు గురవుతున్నానని పేర్కొంటూ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనను గృహ నిర్బంధంలో ఉంచాలని అభ్యర్థించాడు. అయితే, ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. బెయిల్ ఇవ్వలేమిన స్పష్టం చేసింది. మీడియాకు లీకులివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇది ఇలావుండగా, నీరవ్ మోడీకి చెందిన విలాసవంతమైన కార్లను వేలం వేసేందుకు ఈడీ నిర్ణయించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)లో సుమారు రూ. 13వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన వజ్రాల వ్యాపారి, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. నీరవ్ మోడీకి చెందిన 13 విలాసవంతమైన కార్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేలం వేసేందుకు సిద్ధమైంది.
నీరవ్ మోడీ కార్లలో రూ. 2 కోట్లకుపైగా విలువైన బెంట్లీ కారు కూడా ఉండటం గమనార్హం. నవంబర్ 7న ఈ వేలం నిర్వహించనున్నట్లు ఈడీ పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడైన నీరవ్ మోడీని లండన్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం లండన్లోని వాండ్స్వర్త్ జైల్లో ఉన్న నీరవ్ మోడీ.. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన విచారణ నవంబర్ 6న జరగనుంది. కాగా, ఈ ఏడాది ఆగస్టులో మనీలాండరింగ్ చట్టం ప్రత్యేక న్యాయస్థానాన్ని ఈడీ ఆశ్రయించింది.
నీరవ్ మోడీకి చెందిన ఆస్తులన్నింటినీ జప్తు చేసేందుకు అనుమతివ్వాలని కోరింది. అతడికి చెందిన విలువైన వాచ్లు, పెయింటింగ్స్, కార్లను వేలం వేసే విధంగా అనుమతి పొందింది. ఇందులో భాగంగా నవంబర్ 7న వేలం నిర్వహించనుంది.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications