ఊహించలేదు: ఉమాభారతి, రాహుల్ ఇలాకాలో కాంగ్రెస్ ‘0’
ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి 300కు పైగా సీట్లు వస్తాయంటే తాను నమ్మలేదని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పారు. కానీ, ఆరు నెలల క్రితం ప్రచారం ప్రారంభించినప్పుడు మాత్రం నమ్మడం ప్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి 300కు పైగా సీట్లు వస్తాయంటే తాను మొదట నమ్మలేదని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఉమాభారతి చెప్పారు. కానీ, ఆరు నెలల క్రితం ప్రచారం ప్రారంభించినప్పుడు మాత్రం నమ్మడం ప్రారంభించానని తెలిపారు. ఈసారి 300 సీట్లకు పైగా వస్తాయని భావించానని తెలిపారు.
2024వరకూ ఆశలొద్దు: మోడీపై ఒమర్ అబ్దుల్లా సంచలనం, తొలి గెలుపు బీజేపీదే
జాతులపరంగా ఏకమవ్వడంతో గానీ, కులాలు కలవడంతోగానీ ఇది సాధ్యంకాదన్నారు. రాహుల్- అఖిలేష్లు ఇలా చేయలేరన్నారు. అయోధ్య రామాలయం అంశాన్ని ఆయుధంగా చేసుకోలేదని చెప్పారు. దీనికి మోడీ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటారని ఉమాభారతి పేర్కొన్నారు.
రాహుల్ ఇలాకాలో ఖాతా తెరవని కాంగ్రెస్
ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీ మెజార్టీ సీట్లతో దూసుకుపోతోంది. ఆ పార్టీ 300కి పైగా స్థానాల్లో విజయం ఖాయంగా కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీని ఎలాగైనా దెబ్బతీసి అధికారం చేపట్టాలని ఆశించిన ఎస్పీ-కాంగ్రెస్ కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది.
బీజేపీకి ఆ కూటమి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. 12 స్థానాల్లో గెలుపొంది.. మరో 43స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగానూ ఘోరంగా దెబ్బతింది. ఈ ఎన్నికల్లో రాహుల్గాంధీ విస్తృత ప్రచారం నిర్వహించినా తన పార్లమెంటు నియోజకవర్గమైన అమేథీ జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుపించుకోలేకపోవడం గమనార్హం.