ఫైర్ బ్రాండ్ ఎంపీకే ఎసరు, ఎంపీ మొబైల్ నెంబర్ హ్యాక్ చేసి, వజ్రాలు, డబ్బులు !
బెంగళూరు/ గుజరాత్: ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎంలు, కేంద్ర మంత్రులు వారు అధికారికంగా ఉపయోగించే మొబైల్ ఫోన్లు వారి పీఏల దగ్గరకు ఇవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు చర్చించే సమయంలో, అధికారులతో, హైకమాండ్ నాయకులతో మాట్లాడే సమయంలో ఫోన్ లు వస్తే సమాధానం ఇవ్వడం కష్టం అని, వారికి సమాధానం ఇవ్వడం కూడా సాధ్యం కాదని రాజకీయ నాయకులువారి ఫోన్లు వారి పీఏల దగ్గరకు ఇస్తుంటారు.
ప్రజలతో సంబంధాల కొనసాగించడం కోసం రిజర్వ్ చేసిన తన మొబైల్ ఫోన్ నంబర్ను ఉపయోగించి బీజేపీ యువమోర్చ అధ్యక్షుడికి చట్టవిరుద్ధంగా కాల్ చేశారంటూ బీజేపీ జాతీయ యువమోర్చా అధ్యక్షుడు బెంగళూరు సౌత్ లోక్ సభ నయోజక వర్గం ఎంపీ తేజస్వి సూర్య బెంగళూరు దక్షిణ డివిజన్లోని సీఈఎన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గుజరాత్ రాష్ట్రానికి చెందిన యువమోర్చా అధ్యక్షుడు ప్రశాంత్ కొరాటకు ఫోన్ చేసి తాను బెంగళూరు ఎంపీని అని, తనకు వజ్రాలు, డబ్బు ఇవ్వాలని తేజస్వీ సూర్య పేరుతో డిమాండ్ చేశారని తెలిసింది.

నాలుగు రోజుల క్రితం గుజరాత్ రాష్ట్ర బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు ప్రశాంత్ కొరాటేకు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు కూడా అయిన ఎంపీ తేజస్వి సూర్య ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వెళ్లింది. తనకు కొన్ని వజ్రాలు, డబ్బులు కావాలని తేజస్వి సూర్య పేరుతో ప్రశాంత్ తో మాట్లాడారు. ఈ ఫోన్ కాల్పై అనుమానం వచ్చిన ప్రశాంత్ వెంటనే బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్యను సంప్రదించారు.
నేను మిమ్మల్ని బంగారు, వజ్రాలు, డబ్బులు అడగాల్సిన అవసరం ఏముంది అంటూ తేజస్వి సూర్య గుజార్ బీజేపీ అధ్యక్షుడు ప్రశాంత్ ను ప్రశ్నించాడ, అయితే తరువాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య తరపున ఆయన వ్యక్తిగత కార్యదర్శి వి.భానుప్రకాష్ సీఇఎన్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
పని ఒత్తిడి కారణంగా ఎంపీ తేజస్వి సూర్య అధికారికంగా ఉపయోగించే మొబైల్ నంబర్ ఉన్న ఫోన్ ను ఆయన ప్రైవేట్ సెక్రటరీ భానుప్రకాష్ వద్దకు ఇచ్చాడు. బానుపసరస అతను ఈ మొబైల్కు కాల్లను స్వీకరిస్తాడు. ఇదే సమయంలో ఎవరు ఫోన్లు చేశారు అనే సమాచారం గురించి ఎంపీ తేజస్వీ సూర్యకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాడు. జూలై 1వ తేదీన గుజరాత్ బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు ప్రశాంత్ కోరాట్కు ఎంపీ తేజస్వి సూర్య మొబైల్ ఫోన్ నుంచి కాల్ వెళ్లింది. ఫోన్ చేసిన వ్యక్తి తనకు డబ్బు, వజ్రాలు కావాలని డిమాండ్ చేశాడు.
ప్రశాంత్ కోరట్ వెంటనే బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్యను సంప్రదించారు. తన పర్సనల్ సెక్రటరీ నుంచి అలాంటి కాల్ ఏదీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్న భానుప్రకాష్ ఎంపీ తేజస్వి సూర్య మొబైల్ నంబర్ను దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో అభ్యర్థించారని పోలీసు అధికారులు తెలిపారు. అన్నట్లు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు అభిమాని మాత్రమే కాకుండా ఆయనతో సన్నిహితంగా ఉంటున్నాడు.
-
డీలిమిటేషన్ పై మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
ఎంపీ రాఘవ్ చడ్డాకు బిగ్ షాక్.. సెక్యూరిటీని తొలగింపు ?? -
YS Jagan: బెంగళూరు నుంచి మకాం మార్చబోతున్న జగన్ ? కూటమికి కౌంటర్ ప్లాన్..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..!












Click it and Unblock the Notifications