కార్లు ఎలా కొంటున్నారు?: ఆదాయపన్నుపై జైట్లీ షాకింగ్ కామెంట్స్
ఆదాయప పన్ను శాఖ రిటర్న్ ఫైల్ చేస్తున్న వారు కొద్దిమందేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. పన్ను కట్టే వారి పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: ఆదాయప పన్ను శాఖ రిటర్న్ ఫైల్ చేస్తున్న వారు కొద్దిమందేనని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. బుధవారం నాడు జైట్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా పన్ను కట్టే వారి పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చాలామంది తమ ఆదాయాన్ని తక్కువగా చూపిస్తున్నారని చెప్పారు. ఐటీ రిటర్న్స్ తక్కువ మంది ఫైల్ చేస్తున్నందున.. ఆ సంఖ్య పెంచేలా చూస్తామని చెప్పారు.
ఆదాయం తక్కువ ఉంటునన్న వారు కార్లు ఎలా కొంటున్నారో చెప్పాలన్నారు. పన్నులు ఎగ్గొడుతున్న వారి ప్రభావం నిజాయితీపరుల పైన పడుతోందన్నారు.

పన్నులు కట్టే అలవాటు పెద్దగా లేదు
భారత దేశంలో పన్నులు కట్టే అలవాటు పెద్దగా లేదని చెప్పారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తున్న వారు కోటీ 72 లక్షల మందేనని చెప్పారు. పన్నుల పరిధిని విస్తరిస్తామని తెలిపారు. 5 లక్షల 94వేల కంపెనీలు నష్టాల్లో ఉన్నట్లు ఐటీ రిటర్న్స్ వచ్చాయని చెప్పారు. పన్ను ఎగవేయవద్దని చెప్పారు.
రూ.50 లక్షలకు పైగా ఆస్తులు చూపిస్తున్న వారు 1.72 లక్షల మంది అని, 99 లక్షల మంది 2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం చూపిస్తున్నారని చెప్పారు. నోట్ల రద్దు తర్వాత 1.48 లక్షల బ్యాంకు అకౌంట్లలో రూ.80 లక్షల కోట్లు వరకు వచ్చి చేరాయన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications