Union Budget 2022: వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్; డిజిటల్ విధానంలో ఇకనుండి దేశంలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్లు
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఘడియల్లో ఉన్నామని, మరో 25 సంవత్సరాల విజన్ తో తమ ప్రభుత్వం బడ్జెట్ ను రూపొందించిందని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి ఈ బడ్జెట్ తో పునాది వేశామని నిర్మలమ్మ తెలిపారు.

యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ క్రియేట్ చేసేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తాం
బడ్జెట్ ప్రసంగంలో అనేక కీలక అంశాలను ప్రస్తావించిన నిర్మల సీతారామన్ దేశంలోని భూములపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. భూములను సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం చర్యలు తీసుకుంటున్నామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ క్రియేట్ చేసేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. దీని ద్వారా దేశంలోని ప్రతీ స్థలానికి, ప్లాట్కు, భూమికి 14 అంకెల ఐడెంటిఫికేషన్ నెంబర్ వస్తుంది. అంటే ఇది భూమికి తీసుకునే ఆధార్ లాంటిదని వెల్లడించారు.

డిజిటల్ విధానంలోకి భూముల రికార్డ్స్ ..వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్
ఇక షెడ్యూల్ 8 లోని భూములు ల్యాండ్ రికార్డ్స్ను డిజిటల్ పద్ధతిలోకి మార్చడానికి చర్యలు తీసుకుంటున్నామని నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. ఇందుకోసం నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్తో లింకేజీ చేయబోతున్నామన్నారు. వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ ద్వారా దేశంలో ఎక్కడైనా డీడ్స్, డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయొచ్చని చెప్పారు. వీటికోసం కావాల్సిన సవరణలు చేస్తామని నిర్మల సీతారామన్ ప్రకటించారు. నేషనల్ జనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పలు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైందని నిర్మల సీతారామన్ వెల్లడించారు.

సులభంగా జీవించటం, వ్యాపారం చెయ్యటంపై ఫోకస్ చేశామన్న నిర్మలా సీతారామన్
తన బడ్జెట్ 2022 ప్రసంగంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదుపరి దశ వ్యాపారం చేయడం మరియు సులభంగా జీవించడం గురించి మాట్లాడారు. సులభంగా జీవించడం మరియు వ్యాపారం చేయడం కోసం 'ఒక దేశం, ఒకే రిజిస్ట్రేషన్' యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం ఇందులో భాగంగా ఉంటుందని నిర్మల సీతారామన్ వెల్లడించారు. "ఒక దేశం, ఒక రిజిస్ట్రేషన్ నమోదు కోసం ఏర్పాటు చేయబడుతుందని పేర్కొన్నారు. ఇది కాకుండా, దేశంలో వ్యాపారాన్ని సులభతరం చేయడానికి 75,000 కంప్లైంట్లను తొలగించామని మరియు 1,486 యూనియన్ చట్టాలను కూడా రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
Recommended Video

ప్రత్యేక ఆర్థిక మండళ్ళ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని నిర్మలా సీతారామన్ ప్రతిపాదన
చెల్లింపులలో జాప్యాన్ని తగ్గించడానికి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలకు ఆన్లైన్ బిల్లు చెల్లింపు వ్యవస్థ గురించి కూడా సీతారామన్ మాట్లాడారు.ఎంటర్ప్రైజ్ మరియు హబ్ల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండళ్ళ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని ఆమె తన బడ్జెట్ 2022 ప్రసంగంలో ప్రతిపాదించారు. ఈ కొత్త చట్టం ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక అవసరాలను కవర్ చేస్తుందని మరియు ఎగుమతుల పోటీతత్వాన్ని పెంపొందిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2022-23 రాబోయే 25 ఏళ్లలో భారతదేశ ఆర్థిక వృద్ధి మరియు విస్తరణకు పునాది వేస్తుందని సీతారామన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అనేక అంశాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా బడ్జెట్ ప్రసంగం సాగింది.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications