Union Budget 2025: పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్

Union Budget: పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టే ముందు శనివారం రాష్ట్రపతి భవన్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. బడ్జెట్ ప్రతిపాదనల రూపురేఖలను ఆర్థిక మంత్రి రాష్ట్రపతితో చర్చించారు. బడ్జెట్ వివరాలను రాష్ట్రపతికి కేంద్ర మంత్రి వివరించారు. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి అనుమతించారు. కేంద్రమంత్రికి రాష్ట్రపతి మిఠాయి తినిపించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో కేబినెట్ సమావేశానికి బయలుదేరారు. కేబినెట్ ఆమోదం అనంతరం ఉదయం 11 గంటలకు లోక్ సభలో వరుసగా 8వ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ఆదాయ, వ్యయ ప్రతిపాదనలు, పన్నుల సంస్కరణలు, ఇతర ముఖ్యమైన ప్రకటనలు ఉంటాయి.ఇదిలా ఉండగా, శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే, వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత ఆర్థిక వ్యవస్థ 6.3 శాతం నుండి 6.8 శాతం మధ్య వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. కేంద్ర బడ్జెట్‌కు ఒక రోజు ముందు ప్రవేశపెట్టిన ఈ సర్వే, దేశ ఆర్థిక ప్రాథమిక అంశాలు బలంగా ఉన్నాయని పేర్కొంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్.. సూక్ష్మ, చిన్న,మధ్య తరహా సంస్థలు(ఎంఎస్ఎంఈలు), మూలధన వస్తువులపై దృష్టి సారించడం ద్వారా ప్రభుత్వం దీర్ఘకాలిక పారిశ్రామిక వృద్ధిని బలోపేతం చేయాలని యోచిస్తోందని పేర్కొంది.

Union Budget 2025 President Gives Green Signal for Parliament Presentation

కూరగాయల ధరలలో కాలానుగుణ తగ్గుదల, ఖరీఫ్ పంట రాక కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతుందని సర్వే పేర్కొంది. రబీ పంట దిగుబడి బాగా ఉండటం వల్ల 2026 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఆహార ధరలు అదుపులో ఉంటాయని భావిస్తున్నారు. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితులు,పెరుగుతున్న అంతర్జాతీయ వ్యవసాయ ధరలు ద్రవ్యోల్బణానికి ముప్పు కలిగిస్తాయి.

భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు బలంగా ఉన్నాయని, బాహ్య రుణంలో 90 శాతం కవర్ చేస్తున్నాయని, పది నెలలకు పైగా దిగుమతి కవరేజీని అందిస్తున్నాయని సర్వే పేర్కొంది. ఈ నిల్వలు జనవరి 2024లో 616.7 బిలియన్ల యూఎస్ డాలర్ల నుండి సెప్టెంబర్ 2024లో 704.9 బిలియన్ల యూఎస్ డాలర్లకు పెరిగాయి. తరువాత జనవరి 3, 2025 నాటికి 634.6 బిలియన్ల యూఎస్ డాలర్లకు తగ్గాయి. ఉపాధి రంగంలో గణనీయమైన వృద్ధి ఉందని సర్వే పేర్కొంది. నికర ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్వో) సభ్యత్వాలు 2019 ఆర్థిక సంవత్సరంలో 61 లక్షల ఉండగా... 2024 ఆర్థిక ఏడాదిలో 131 లక్షలకు పెరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+