దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ 2026-27ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఫిబ్రవరి 1) పార్లమెంటులో ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను సమర్పిస్తూ ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఆదివారం నాడు బడ్జెట్ ప్రసంగం జరుగుతుండటం విశేషం. ఉదయం 11 గంటలకు లోక్సభలో ప్రారంభమైన ఈ ప్రసంగంపై మధ్యతరగతి ప్రజల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులు ఉంటాయా? నిత్యావసరాల ధరలకు కళ్లెం పడుతుందా? అన్నది మరికొద్ది సేపట్లో తేలిపోనుంది.
అభివృద్ధి మంత్రం.. ఎన్నికల రాష్ట్రాలపై వరాల జల్లు!
ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు, వ్యవసాయం , ఉపాధి కల్పనకు పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా డిజిటల్ ఇండియా, గ్రీన్ ఎనర్జీ రంగాలకు భారీ కేటాయింపులు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టే దిశగా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? 'మేక్ ఇన్ ఇండియా'కు కొత్త ఊపిరి పోసే పథకాలు ఏవి? ప్రతి కీలక ప్రకటనను, లైవ్ అప్డేట్స్ను, నిపుణుల విశ్లేషణలను క్షణక్షణం మీ ముందుకు తెస్తున్నాం. తాజా సమాచారం కోసం మా లైవ్ బ్లాగ్ను ఫాలో అవ్వండి!
Feb 01, 2026, 12:58 pm IST
ముగసిన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం..దాదాపుగా 80 నిమిషాల పాటు సాగిన ప్రసంగం
Feb 01, 2026, 12:24 pm IST
సాఫ్ట్వేర్ రంగానికి చెందిన అన్ని సేవలు ఇకపై ఒక రంగం కిందికే తీసుకొస్తున్నాం.
Feb 01, 2026, 12:21 pm IST
ఆడిట్ కాని వ్యాపారాలు లేదా ట్రస్టులకు ఆగస్టు 31 వరకు సమయం ఇవ్వబడుతుంది
Feb 01, 2026, 12:21 pm IST
డిసెంబర్ 31 నుండి మార్చి 31 వరకు రిటర్న్ రివిజన్ వ్యవధిని పొడిగించాలని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. దీనికి నామమాత్రపు రుసుము మాత్రమే వసూలు చేయబడుతుంది. అదనంగా, పన్ను రిటర్న్ దాఖలు గడువులను దశలవారీగా తగ్గించడం జరుగుతుంది
Feb 01, 2026, 12:18 pm IST
విద్య వైద్య ప్రయోజనాల కోసం సరళీకృత చెల్లింపు పథకం (LRS) కింద TCS రేటును 5% నుండి 2%కి తగ్గించాలని ప్రతిపాదన
Feb 01, 2026, 12:18 pm IST
విదేశీ ప్రయాణ కార్యక్రమ ప్యాకేజీల అమ్మకంపై TCS రేటును ప్రస్తుత 5% మరియు 20% నుండి 2%కి తగ్గించాలని ప్రతిపాదించాం: నిర్మలా సీతారామన్
Feb 01, 2026, 12:15 pm IST
విదేశీ ఆస్తుల ప్రకటనకు వన్ టైమ్ స్కీమ్
Feb 01, 2026, 12:14 pm IST
మోటార్ యాక్సిడెంట్ చెల్లింపులపై పన్ను సడలింపు
Feb 01, 2026, 12:09 pm IST
డేటా సెంటర్లు ఏర్పాటు చేసేవారికి గుడ్ న్యూస్
భారత్లో ఏ కంపెనీలైతే డేటా సెంటర్లు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి సేవలు ప్రారంభిస్తాయో అట్టి కంపెనీలకు 2047 వరకు ఎలాంటి పన్నులు చెల్లించనక్కర్లేదు
Feb 01, 2026, 12:06 pm IST
ఏప్రిల్ 1 నుండి కొత్త ఐటీ చట్టం
కొత్త ఐటీ చట్టం ఏప్రిల్ నుండి అమల్లోకి వస్తుంది ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే తేదీని మార్చి 31 వరకు పొడిగించడం జరిగింది
Feb 01, 2026, 11:58 am IST
టాక్స్ పేయర్లు పన్ను కట్టేందుకు సమయం మరింత పెంచాం
Feb 01, 2026, 11:53 am IST
రాష్ట్రాలకు 1.4లక్షల కోట్లు గ్రాంట్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సహజ విపత్తులు సంభవిస్తే వాటికి ఈ గ్రాంట్లను వినియోగిస్తాం
Feb 01, 2026, 11:52 am IST
ఈశాన్యం రాష్ట్రాల్లో బౌద్ధ మతానికి ప్రాధాన్యం. ఇందులో భాగంగా బౌద్ధ మతం వర్థిల్లేందుకు అన్ని చర్యలు చేపడతాం: నిర్మలా సీతారామన్
Feb 01, 2026, 11:51 am IST
మానసిక ఆరోగ్య సంరక్షణకు ఉత్తర భారతదేశంలో ఎలాంటి కేంద్రాలు లేవు. ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది: నిర్మలా సీతారామన్
Feb 01, 2026, 11:47 am IST
కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో జతకట్టి గంధపు చెట్లను పెంచేలా ప్రోత్సహిస్తాం.
Feb 01, 2026, 11:45 am IST
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, " భారతదేశం వెలుపల నివసించే వ్యక్తులు (PROI) పోర్ట్ఫోలియో పెట్టుబడి పథకం ద్వారా లిస్టెడ్ భారతీయ కంపెనీల ఈక్విటీ సాధనాలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించడం జరుగుతుంది. PROI కోసం పెట్టుబడిని 5% నుండి 10%కి పెంచాలని కూడా ప్రతిపాదించడం జరిగింది."
Feb 01, 2026, 11:43 am IST
రైతు ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నాం.
Feb 01, 2026, 11:43 am IST
క్రీడలను ప్రోత్సహించేందుకు ఖేలో ఇండియా మిషన్ను ప్రతిపాదిస్తున్నాం. ఇందులో భాగంగా శిక్షణా కేంద్రాలు, కోచ్లు, సపోర్టింగ్ స్టాఫ్లను ప్రోత్సహిస్తాం
Feb 01, 2026, 11:42 am IST
15 ఆర్కియాలాజికల్ సైట్ల అభివృద్ధి చేస్తాం
Feb 01, 2026, 11:41 am IST
అరకులో మౌంటెయిన్ ట్రైన్
Feb 01, 2026, 11:40 am IST
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్లలో మౌంటెయిన్ ట్రైన్స్ ఏర్పాటు
Feb 01, 2026, 11:37 am IST
వారసత్వ పారిశ్రామిక రంగాలను పునరుజ్జీవింపజేయడం గురించి సీతారామన్ మాట్లాడుతూ, ఖర్చు పోటీతత్వం మరియు సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి 200 వారసత్వ పారిశ్రామిక క్లస్టర్లను పునరుద్ధరించే పథకాన్ని ప్రతిపాదిస్తున్నారు.
Feb 01, 2026, 11:35 am IST
కోవిడ్ తర్వాత ఆయుర్వేద ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో మూడు ఆలిండియా ఆయుర్వేద ఇన్స్టిట్యూట్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది
Feb 01, 2026, 11:34 am IST
ఐదు రీజియనల్ మెడికల్ హబ్లు ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తాం. మెడికల్ టూరిజం ప్రమోట్ చేయడమే లక్ష్యం. దీనివల్ల ఉద్యోగాల కల్పన జరుగుతుంది
Feb 01, 2026, 11:33 am IST
వచ్చే ఐదేళ్లలో కొత్తగా 20 జలమార్గాల అభివృద్ధి: నిర్మలా సీతారామన్
Feb 01, 2026, 11:29 am IST
వారణాసి పాట్నాలలో షిప్ రిపేరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం: నిర్మలా సీతారామన్
Feb 01, 2026, 11:27 am IST
వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరేలా.. బ్యాంకింగ్ రంగంలో మరింత వృద్ధి సాధించేందుకు అత్యున్నత కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం: నిర్మలా సీతారామన్
Feb 01, 2026, 11:26 am IST
ముంబై-పూణే,పూణే-హైదరాబాద్,హైదరాబాదు-బెంగళూరులకు హైస్పీడ్ రైలు కారిడార్లు
Feb 01, 2026, 11:24 am IST
టూరిజంను ప్రోత్సహించే భాగంగా సీ ప్లేన్ తయారీదారులకు ప్రోత్సాహకాలు అందిస్తామంటూ నిర్మలా సీతారామన్ ప్రకటన
నేడే కేంద్ర బడ్జెట్ 2026: ఉదయం 11 గంటలకే కీలక ప్రకటనలు
దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ 2026-27ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (ఫిబ్రవరి 1) పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు లోక్సభలో ఆమె బడ్జెట్ ప్రసంగం ప్రారంభమవుతుంది. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను సమర్పిస్తూ ఆమె సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు. ఒక దశాబ్దం తర్వాత ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
8:33 AM, 1 Feb
నివాసం నుంచి బయలుదేరిన నిర్మలమ్మ.. కాసేపట్లో నార్త్ బ్లాక్ చేరుకోనున్న ఆర్థిక మంత్రి!
#WATCH | Delhi | Union Finance Minister Nirmala Sitharaman leaves from her residence for the Ministry of Finance, ahead of the presentation of the Union Budget 2026-27 today pic.twitter.com/OZWgDfWZxv
రూ. 54.1 లక్షల కోట్ల భారీ పద్దు? గతేడాది కంటే 7.9శాతం పెరుగుదల!
కేంద్ర బడ్జెట్ పరిమాణంపై ఓ ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ కీలక అంచనాలను వెలువరించింది. ఈ ఏడాది బడ్జెట్ గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.54.1 కోట్లకు చేరుకోవచ్చని ఈ నివేదిక పేర్కొంది. అంటే ఇది గతేడాది కంటే 7.9 శాతం అధికం.
9:02 AM, 1 Feb
నేటి పార్లమెంటు షెడ్యూల్
ఉదయం 10:15: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం. బడ్జెట్ ప్రతిపాదనలకు అధికారిక ఆమోదం.
ఉదయం 11:00: లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభం.
మధ్యాహ్నం 12:30 - 1:00: ప్రసంగం ముగిసిన వెంటనే బడ్జెట్ పత్రాలు, 'ఫైనాన్స్ బిల్' సభ ముందు ఉంచుతారు.
9:06 AM, 1 Feb
బడ్జెట్ ప్రసంగంలో వినే ఆ 'కీలక పత్రాల' అర్థం ఇదే!
1. మీడియం-టర్మ్ ఫిస్కల్ పాలసీ: దీనిని తెలుగులో 'మధ్యకాలిక రాజకోశ విధాన వ్యూహ ప్రకటన' అంటారు. ప్రభుత్వం వచ్చే రెండు మూడేళ్లలో తన ఖర్చులను, అప్పులను, ఆదాయాన్ని ఎలా నిర్వహించబోతోందో ఈ పత్రం వివరిస్తుంది. అంటే రాబోయే కాలంలో ఆర్థిక లోటునుఎలా తగ్గించాలనే రోడ్ మ్యాప్ ఇందులో ఉంటుంది.
2. మాక్రో-ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ స్టేట్మెంట్: దేశ ఆర్థిక వ్యవస్థ 'స్థూల చిత్రపటం' ఇది. ఇందులో జీడీపీ వృద్ధి రేటు ఎంత ఉండొచ్చు? ద్రవ్యోల్బణం పరిస్థితి ఏంటి? వంటి కీలక గణాంకాలు ఉంటాయి. దేశ ఆర్థిక ఆరోగ్యం ఎలా ఉందో ఇది తెలియజేస్తుంది.
3. ఫైనాన్స్ బిల్ (ఆర్థిక బిల్లు), 2026: బడ్జెట్ ప్రసంగం చివరలో మంత్రి దీనిని ప్రవేశపెడతారు. బడ్జెట్లో ప్రకటించిన పన్ను మార్పులు చట్టబద్ధంగా అమలు కావాలంటే ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందాలి. కొత్త పన్ను రేట్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? ఏయే రాయితీలు లభిస్తాయి? అనే వివరాలు ఈ బిల్లులో ఉంటాయి.
9:22 AM, 1 Feb
బడ్జెట్ టాబ్లెట్తో నిర్మలమ్మ టీమ్ సందడి!
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ సమర్పణకు సర్వం సిద్ధమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బృందంతో కలిసి నార్త్ బ్లాక్ (ఆర్థిక మంత్రిత్వ శాఖ) బయట ప్రత్యక్షమయ్యారు. సంప్రదాయ ఎరుపు రంగు కవర్తో ఉన్న డిజిటల్ టాబ్లెట్ను చేతబూని ఆమె ఫోటోలకు ఫోజులిచ్చారు.
#WATCH | Delhi: Union Finance Minister Nirmala Sitharaman, along with her team, with the Budget tablet outside the Ministry of Finance.
ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాకు చెందిన ప్రముఖ కళాకారుడు జుహైబ్ ఖాన్ తన కళాఖండంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బొగ్గు స్కెచ్ను రూపొందించారు.
#WATCH Amroha, Uttar Pradesh | An artist from Amroha, Zuhaib Khan makes a charcoal sketch ahead of the presentation of #UnionBudget2026 today.
కేంద్ర బడ్జెట్ను సమర్పించేందుకు సిద్ధమైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్థిక మంత్రికి స్వయంగా మిఠాయి తినిపించి, దేశ ఆర్థిక పద్దుకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Union Minister for Finance and Corporate Affairs Smt Nirmala Sitharaman along with Minister of State for Finance Shri Pankaj Chaudhary and senior officials of the Ministry of Finance called on President Droupadi Murmu at Rashtrapati Bhavan before presenting the Union Budget. The… pic.twitter.com/XhBbxwFeAS
మరో 25 నిమిషాల్లో నిర్మలమ్మ పద్దు.. ఆదివారం నాటి అద్భుత ఘట్టంపై సర్వత్రా ఉత్కంఠ!
10:37 AM, 1 Feb
బడ్జెట్కు ముందే డిఫెన్స్ షేర్ల జోరు
ఈ బడ్జెట్లో రక్షణ రంగానికి భారీ కేటాయింపులు ఉంటాయనే ఆశతో స్టాక్ మార్కెట్లోని డిఫెన్స్ షేర్లు ఉదయం నుంచే భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
10:41 AM, 1 Feb
నిర్మలమ్మ పద్దుపై విపక్షాల ముందస్తు విమర్శలు!
నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగానికి సిద్ధమవుతున్న వేళ, ప్రతిపక్ష పార్టీలు కేంద్రపై విమర్శల దాడిని ప్రారంభించాయి. ఈ బడ్జెట్ వల్ల సామాన్యులకు ఎలాంటి ఒరిగేది లేదని, తమకు ఈ పద్దుపై ఎటువంటి ఆశలు లేవని విపక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు.
10:50 AM, 1 Feb
బడ్జెట్కు కేబినెట్ ఆమోదం
బడ్జెట్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాసేపట్లో నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
11:09 AM, 1 Feb
ఎగుమతులపై ఆధారపడటం తగ్గించేశాం
11:09 AM, 1 Feb
సంస్కరణలను కొనసాగిస్తూనే 7శాతం వృద్ధిని నమోదు చేశాం
11:10 AM, 1 Feb
అంతర్జాతీయ మార్కెట్లతో మమేకమై ముందుకు వెళుతున్నాం
11:11 AM, 1 Feb
బడ్జెట్ 2026-27 యువశక్తికి పెద్ద పీట వేస్తుంది
11:13 AM, 1 Feb
ఈ సారి బడ్జెట్ మూడు కర్తవ్యాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేయడం జరిగింది.1)మొదటిది పోటీతత్వాన్ని పెంచడం మరియు అస్థిర ప్రపంచ గతిశీలతకు స్థితిస్థాపకతను పెంపొందించడం ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం మరియు నిలబెట్టడం.రెండవది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, వారి సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు భారతదేశం యొక్క శ్రేయస్సు మార్గంలో వారిని బలమైన భాగస్వాములుగా చేయడం.మూడవ కర్తవ్యం 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్' నిర్ధారించడం. ప్రతి కుటుంబం, సమాజం, ప్రాంతం అర్థవంతమైన భాగస్వామ్యానికి వనరులు, సౌకర్యాలు అవకాశాలను పొందేలా చూడటం.
11:14 AM, 1 Feb
ఆరోగ్య రంగం కోసం బయో ఫార్మా శక్తిని తీసుకొస్తున్నాం. బయో ఫార్మా స్ట్రాటజీ కోసం రూ.10వేల కోట్లు కేటాయింపు
11:15 AM, 1 Feb
మౌళిక సదుపాయాల అభివృద్ధికి పెద్ద పీట అదే సమయంలో పట్టణాల అధునీకీకరణ చేపడతాం
11:19 AM, 1 Feb
సెమీ కండక్టర్ ఇండస్ట్రీలకు ఊతం. సెమీ కండక్టర్ల రంగంలో పరిశోధన,శిక్షణా కేంద్రాల కోసం రూ.40వేల కోట్లు కేటాయింపు