దంతెవాడ ఘటనపై కేంద్రం ఆగ్రహం- ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ బఘేల్ కు అమిత్ షా హామీ..
ఛత్తీస్ ఘడ్ లోని మావోయిస్టు ప్రభావిత దంతెవాడ జిల్లాలో ఇవాళ మావోయిస్టులు బాంబుపేల్చిన ఘటన కలకలం రేపుతోంది. కూంబింగ్ లో పాల్గొంటున్న పోలీసుల్ని టార్గెట్ చేస్తూ మావోయిస్టులు పేల్చిన బాంబు 10 మందికి పైగా పోలీసుల ప్రాణాలు తీసింది. వీరితోపాటు వారి వాహనం డ్రైవర్ కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రంతో పాటు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాయి.
దంతెవాడలో మావోయిస్టులు పోలీసు వాహనాన్ని పేల్చేసిన ఘటనపై స్పందించిన ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్.. ఇదో దురదృష్టకరమైన ఘటన అని పేర్కొన్నారు. దీనిపై ఇప్పుడే సమాచారం అందిందన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నక్సల్స్ తో పాటు చివరి దశలో ఉందని, వారిని వదిలిపెట్టే సమస్యే లేదన్నారు.

అనంతరం ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఘటనపై ఆరా తీశారు. ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వానికి అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
#WATCH | On reports of an IED attack by naxals on security personnel in Dantewada, claiming the lives of 11 personnel, Chhattisgarh CM Bhupesh Baghel says, "There is such information with us. It is very saddening. My condolences to the bereaved families. This fight is in its last… https://t.co/n1YV67sIoi pic.twitter.com/CC8Dj0uAca
— ANI (@ANI) April 26, 2023
జిల్లా రిజర్వ్ పోలీసు గార్డ్స్ ను తీసుకెళ్తున్న వాహనంపై దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమిత్ షా.. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి బాధ్యులను మట్టుపెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications