ప్రియాంక గాంధీ ‘1000’ బస్సులకు యూపీ సర్కారు గ్రీన్ సిగ్నల్
లక్నో: వలస కూలీలను తిరిగి సొంత రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తాము 1000 బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు తమకు ప్రభుత్వ అనుమతి కావాలంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఆ విన్నపానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అంగీకరిస్తూ ప్రియాంక గాంధీ కార్యాలయానికి లేఖ రాసింది.
అయితే, కాంగ్రెస్ ఏర్పాటు చేసే 1000 బస్సులు, డ్రైవర్ల వివరాలను వీలైనంత తొందరగా ప్రభుత్వానికి తెలియజేయాలని రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి అవనీశ్ అవస్థి.. ప్రియాంక గాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీనిపై ప్రియాంక గాంధీ నుంచి సమాధానం రావాల్సి ఉంది.

వలస కార్మికుల తరలింపు విషయమై ప్రియాంక గాంధీ మే 16న సీఎం యోగి ఆదిత్యనాథ్కు సందేశం పంపించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను తీసుకువచ్చేందుకు తాము 1000 బస్సులను నడుపుతామని చెప్పారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి కావాలని కోరారు.
సరిహద్దులోనే తమ బస్సులు ఉన్నాయని, అనుమతి ఇస్తే వలస కూలీలను తీసుకొస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం ప్రియాంక గాంధీ విన్నపానికి అనుమతిస్తూ.. అందుకు సంబంధించిన వివరాలను తెలపాలని కోరింది. యూపీ ప్రభుత్వానికి ప్రియాంక నుంచి సమాధానం వెళ్లాల్సి ఉంది.
12వేల బస్సులు పంపుతున్న యూపీ సర్కారు
కాగా, వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలసకార్మికులను తీసుకొచ్చేందుకు ఇప్పటికే యూపీ ప్రభుత్వం వేలాది బస్సులను పంపింది. వేలాది మంది కార్మికులు యూపీకి చేరుకున్నారు. తాజాగా 12000 బస్సులను వివిధ రాష్ట్రాలకు పంపుతున్నట్లు యోగి సర్కారు వెల్లడించింది. రాష్ట్రానికి చెందిన వలస కూలీలను తీసుకురావడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడటం లేదని తెలిపింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications