ఆ 17కులాలను ఎస్సీల్లో చేర్చాలని సీఎం నిర్ణయం..
యూపీలోని వెనుకబడిన (ఓబీసీ) 17కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు.
లక్నో: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ తీసుకున్న నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కులం కార్డును ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు అఖిలేష్ యాదవ్ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం యూపీలోని వెనుకబడిన (ఓబీసీ) 17కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదం కోసం పంపించారు. కేంద్రం గనుక ఆమోదం తెలిపిదే ఈ 17కులాల వారికి ఎస్సీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. వచ్చే ఏడాది జరగబోయే యూపీ ఎన్నికలను పార్టీకి అనుకూలంగా మార్చేందుకే అఖిలేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

ఆ 17 కులాలు ఇవే:
కహర్, కశ్యప్, కేవత్, నిషాద్, బింద్, బహర్, ప్రజాపతి, రాజ్ భర్, బథాం, గౌర్, తురా, మఝీ, మల్హా,ధీమర్, మచౌ, వీటితో పాటు మరో మూడు కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని అఖిలేష్ సర్కార్ యోచిస్తోంది.
కాగా, 17కులాలను ఓబీసీల్లో చేర్చాలన్న తీర్మానాన్ని గత 2013మార్చిలో జరిగిన అసెంబ్లీ ఆమోదించింది. యూపీఎస్సీ, ఎస్టీ రీసెర్చ్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్ సమగ్ర అధ్యయనం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వం తీర్మానంలో పొందుపరిచింది.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications