ఆ 17కులాలను ఎస్సీల్లో చేర్చాలని సీఎం నిర్ణయం..
యూపీలోని వెనుకబడిన (ఓబీసీ) 17కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు.
లక్నో: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ తీసుకున్న నిర్ణయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. కులం కార్డును ఓటు బ్యాంకుగా మలుచుకునేందుకు అఖిలేష్ యాదవ్ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం యూపీలోని వెనుకబడిన (ఓబీసీ) 17కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదం కోసం పంపించారు. కేంద్రం గనుక ఆమోదం తెలిపిదే ఈ 17కులాల వారికి ఎస్సీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. వచ్చే ఏడాది జరగబోయే యూపీ ఎన్నికలను పార్టీకి అనుకూలంగా మార్చేందుకే అఖిలేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

ఆ 17 కులాలు ఇవే:
కహర్, కశ్యప్, కేవత్, నిషాద్, బింద్, బహర్, ప్రజాపతి, రాజ్ భర్, బథాం, గౌర్, తురా, మఝీ, మల్హా,ధీమర్, మచౌ, వీటితో పాటు మరో మూడు కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలని అఖిలేష్ సర్కార్ యోచిస్తోంది.
కాగా, 17కులాలను ఓబీసీల్లో చేర్చాలన్న తీర్మానాన్ని గత 2013మార్చిలో జరిగిన అసెంబ్లీ ఆమోదించింది. యూపీఎస్సీ, ఎస్టీ రీసెర్చ్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్ సమగ్ర అధ్యయనం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రభుత్వం తీర్మానంలో పొందుపరిచింది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications