వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి షాక్: యూపీ స్థానిక పోరులో ఎస్పీ అఖిలేశ్ జోరు, మోదీ వారణాసి, అయోధ్యలో కమలం డీలా

|
Google Oneindia TeluguNews

ఇంకొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో అధికార బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. మంగళవారం వెలువడిన పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పీ) సత్తా చాటుకుంది. పార్టీ గుర్తులు లేకుండా జరిగిన జిల్లా, క్షేత్ర(మండల), గ్రామ పంచాయితీ ఎన్నికల్లో అడుగడుగునా బీజేపీకి ఎస్పీ, ఇతర ప్రతిపక్షాలు దీటుగా నిలిచాయి.

టీఆర్ఎస్ నుంచీ ఈటల బహిష్కరణ! -రాజేందర్ బీసీ ముసుగులో ఓసీ -వైఎస్సార్‌తో డీల్ -గంగుల, కొప్పుల సంచలనంటీఆర్ఎస్ నుంచీ ఈటల బహిష్కరణ! -రాజేందర్ బీసీ ముసుగులో ఓసీ -వైఎస్సార్‌తో డీల్ -గంగుల, కొప్పుల సంచలనం

ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసితోపాటు బీజేపీ రాజకీయ ఎదుగుదలకు కేంద్రమైన అయోధ్యలోనూ ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. వారణాసిలోని 40 జిల్లా పంచాయతీ సీట్లకుగానూ ఎస్పీ 15 సీట్లను కైవసం చేసుకోగా, బీజేపీ కేవలం 8 సీట్లకే పరిమితమైంది. అయోధ్యలో 40 జిల్లా పంచాయతీ సీట్లకు గాను 24 సీట్లు సమాజ్‌వాదీ పార్టీ గెలుచుకోగా, బీజేపీ కేవలం 6 సీట్లకు పరిమితమైంది. మిగిలిన 10 సీట్లలో మాయావతి సారథ్యంలోని బీఎస్‌పీ 5, ఇండిపెండెంట్లు 5 గెలుచుకున్నారు.

 UP Gram Panchayat Election Results 2021: SP beats BJP in Varanasi, Ayodhya

viral video:కుప్పకూలిన మెట్రో రైల్ -బ్రిడ్జి విరిగి రోడ్డుపై పడ్డ బోగీలు -20మంది దుర్మరణంviral video:కుప్పకూలిన మెట్రో రైల్ -బ్రిడ్జి విరిగి రోడ్డుపై పడ్డ బోగీలు -20మంది దుర్మరణం

యూపీలో మొత్తం 58,176 గ్రామ పంచాయితీల్లో 7.32 లక్షల వార్డులకు, 3,050 క్షేత్ర(మండల) పంచాయితీల్లోని 75,852 వార్డులకు, 75 జిల్లాల్లోని 3,050 జిల్లా పంచాయితీ స్థానాలకు ఏప్రిల్ చివరి వారంలో ఎన్నికలు జరగ్గా, వాటి ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరగడంతో కౌంటింగ్ ప్రక్రియ నిదానంగా సాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు..

మొత్తం 3,050 జిల్లా పంచాయితీ సీట్లలో బీజేపీ బలపరచిన అభ్యర్థులు 918 చోట్ల లీడింగ్‌లో ఉండగా, ఎస్‌పీ బలపర్చిన అభ్యర్థులు 504 సీట్లలో అధిక్యంలో ఉంన్నారు. బీఎస్పీ బలపర్చిన అభ్యర్థుల్లో 132 మంది, కాంగ్రెస్ నుంచి 62 మంది, ఇండిపెండెట్లు 608 మంది లీడింగ్ లో ఉన్నారు. రాజకీయపరంగా వారణాసి, అయోధ్యలను కీలకంగా భావించే బీజేపీ అక్కడి స్థానిక ఎన్నికల్లో ఓడిపోవడం హెచ్చరిక లాంటిదేనని పార్టీనేతలు అంగీకరించారు. యూపీ పంచాయితీ ఎన్నికల తుది ఫలితాలకు ఇంకా సమయం పడుతుంది.

English summary
The counting of votes for the Uttar Pradesh Panchayat elections is currently underway amidst tight security. BJP and Samajwadi Party are in close contest as results for UP Gram Panchayat Election Results started coming in. In Zilla Panchayat, BJP is leading in 220 seats, Samajwadi Party (SP) 186, BSP 56, Congress 45, and others are ahead in 144.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X