బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత్-బంగ్లా మ్యాచ్: గుండెపోటుతో మృతి చెందిన అభిమాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: భారత్ - బంగ్లాదేశ్ మధ్య రెండు రోజుల క్రితం జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రేపింది. చివరి ఓవర్లో 11 బంతులు చేయవలసి ఉండగా బంగ్లాదేశ్.. తొలి మూడు బంతుల్లో 9 పరుగులు చేసింది. ఇక చివరి మూడు బంతుల్లో 2 పరుగులు చేయాల్సిన స్థితిలో.. మూడు వికెట్లు కోల్పోయి ఓడిపోయింది.

ఈ మ్యాచ్ ఉత్కంఠను రేపగా, చివరి ఓవర్‌కు అయితే అందరి నరాలు బిగుసుకున్నాయి. బంగ్లా గెలుస్తుందని, అదే సమయంలో అద్భుతం జరిగినా ఆశ్చర్యం లేదనే ఉత్కంఠ ఏర్పడింది. చివరి ఓవర్‌ను చర్చనీయాంశమైంది.

UP man dies of heart attack during India, Bangladesh thriller!

ఇంతటి హైటెన్షన్ మధ్య జరిగిన మ్యాచ్ వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోయాడు. ఇది ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. ఈ మ్యాచ్ చూస్తున్న యూపీకి చెందిన ఓం ప్రకాశ్ శుక్లా గుండె పోటుకు గురయ్యాడు. వెనువెంటనే ఆసుపత్రికి తరలించారు. అతను మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.

యావత్ క్రికెట్ అభిమానులకు కనువిందు చేసిన ఈ హైటెన్షన్, థ్రిల్లింగ్ మ్యాచ్... ఓం ప్రకాశ్ ఇంట్లో మాత్రం విషాదాన్ని నింపింది. గతంలో ఢిల్లీలో గ్రాసరీ దుకాణం నడిపిన ఇతను, ఆ తర్వాత కుటుంబంతో కలిసి గోరక్‌పూర్‌లో సెటిల్ అయ్యాడు. అతనికి ముగ్గురు కొడుకులు ఉన్నారు.

English summary
UP man dies of heart attack during India-Bangladesh thriller.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X