వివక్ష కాదా..? : బాధిత ముస్లిం కుటుంబాలను పరామర్శించని యూపీ మంత్రి
ఇటీవల ఉత్తరప్రదేశ్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చి పోలీసుల లాఠీచార్జి,కాల్పుల్లో 16 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఉత్తరప్రదేశ్ మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ బిజనౌర్లో పర్యటించారు. అయితే మృతి చెందిన ముస్లిం వ్యక్తుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన నిరాకరించడం గమనార్హం.
ఆ విధ్వంసకారుల ఇంటికి తానెందుకు వెళ్లాలని మంత్రి అగర్వాల్ ప్రశ్నించారు. విధ్వంసకాండలో పాల్గొని బిజనౌర్ను తగలబెట్టినవారి కుటుంబాలను తానెందుకు పరామర్శించాలని అన్నారు. అదే సమయంలో ఓం రాజ్ సైని అనే బాధితుడి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఇటీవలి హింసాకాండలో గాయాలపాలై సైని చికిత్స పొందుతున్నాడు.

కొంతమంది వ్యక్తులను పరామర్శించి,కొంతమంది వ్యక్తుల కుటుంబాలను మాత్రం పరామర్శించకపోవడం వివక్ష కాదా..? అని అగర్వాల్ను మీడియా ప్రశ్నించింది. అయితే విధ్వంసకారుల ఇంటికి తానెందుకు వెళ్లాలని ఆయన ఎదురు ప్రశ్నించారు. విధ్వంసానికి పాల్పడినవారు, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టినవారు సమాజంలో ఎలా భాగస్వాములు అవుతారని ప్రశ్నించారు. ఇది హిందు-ముస్లిం సమస్య కాదని, విధ్వంసకారుల ఇళ్లకు తాను వెళ్లనని స్పష్టం చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications