Rat: ఎలుకను చంపిన కేసులో ఛార్జిషీట్ ఫైల్ చేసిన పోలీసులు..
మనుషులనే కాదు.. ఎలుకలను చంపిన శిక్ష పడుతుందని తెలిసా... అవును ఓ వ్యక్తి ఎలుకతో క్రూరంగా వ్యవహరించి, దాని మరణానికి కారణమయ్యాడు. దీంతో అతనిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఛార్జిషీట్ దాఖల్ చేశారు. ఎలుక పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ రిపోర్టు, వీడియోలు, వివిధ విభాగాలు నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఛార్జిషీట్ దాఖలు చేశారు.
చనిపోయిన ఎలుక ఊపిరితిత్తుల్లో నీళ్లు చేరి, ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరాడక చనిపోయినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. 2022లో నవంబర్లో మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఓ ఎలుక తోకకు రాయి కట్టి మురుగు కాల్వలోకి పడేశాడు.

ఇది చూసిన జంతు సంరక్షణ కార్యకర్త వికేంద్ర శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంతువు పట్ల అతను క్రూరంగా వ్యవహరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలుకను కాపాడేందుకు ప్రయత్నించానని, అయితే అది అప్పటికే చనిపోయిందని తెలిపాడు. ఈ క్రమంలోనే పోలీసులు కుమార్పై ఐపీసీ సెక్షన్ 429తోపాటు జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
చనిపోయిన ఎలుకకు పోస్టు మార్టం నిర్వహించారు. ఎలుక కళేబరాన్ని మొదటగా బదాయూలోని వెటర్నరీ ఆసుపత్రికి తరలించగా వారు నిరాకరించారు. అనంతరం దాన్ని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐవీఆర్ఐ)కు తరలించారు.
పోస్టుమార్టం చేసిన వైద్యులు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఎలుక చనిపోయినట్లు తేల్చారు. దీంతో యూపీ పోలీసులు తాజాగా బదాయూ కోర్టులో నిందితుడిపై 30 పేజీల ఛార్జిషీట్ దాఖలు ఫైల్ చేశారు. కుమార్ మట్టి పాత్రలను ఎలుకలు పాడు చేశాయని అతని తండ్రి చెప్పాడు. కుమార్ మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడని తెలిపాడు. ఒక వేళ ఈ కేసులో కుమార్ దోషిగా తేలితే జంతు హింస నిరోధక చట్టం కింద గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications