దారి ఇవ్వలేదని కాల్చి చంపిన ఎమ్మెల్యే సోదరుడు
లక్నో: తమ వాహనం ముందుకు వెళ్లేందుకు దారి ఇవ్వలేదన్న ఆగ్రహంతో అధికార పార్టీ ఎమ్మెల్యే సోదరుడు ఓ వ్యక్తిని కాల్చి చంపిన దారుణ సంఘటన ఉత్తర్ ప్రదేశ్లో చోటుచేసుకుంది. సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే జగ్రామ్ పాశ్వాన్ న్ సోదరులు అన్నూ యాదవ్, పప్పు పాస్వాన్.
వీరు తమ బంధువు అంగద్తో కలిసి ఓ వివాహానికి హాజరై వస్తున్నారు. ఈ సందర్భంగా ధనేపూర్ ప్రాంతంలో శనివారం ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని దాటి వెళ్లడానికి ఎమ్మెల్యే సోదరులు చాలాసేపు విఫలమయ్యారు.
ఆ తర్వాత ఎట్టకేలకు ముందు వెళ్తున్న వాహనాన్ని దాటుకొని వెళ్లారు. ఆ తర్వాత ముదు వెళ్తున్న వాహనంలో ఉన్నవారితో గొడవ పడ్డారు. అనంతరం అన్నూ కాల్పులు జరపడంతో... జైరామ్ యాదవ్ అనే వ్యక్తి మృతి చెందాడు. అన్నూను సోమవారం అరెస్టు చేశారు. పప్పు, అంగద్ పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.