Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూపీ పోల్స్: నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు పరుగెత్తిన మంత్రి(వీడియో)

లక్నో: మరికొద్ది రోజుల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ తమ నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కాగా, ఉత్తరప్రదేశ్ బాలియా జిల్లాలో శుక్రవారం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఫేఫ్నా స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి ఉపేంద్ర తివారీ.

ఆయన తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు ఉరుకులు పరుగులు పెడుతూ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

UP polls: BJP minister Upendra Tiwari runs to file nomination papers

ఫిబ్రవరి 11వ తేదీ వరకు నామినేషన్ వేసేందుకు సమయం ఉన్నప్పటికీ.. శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వచ్చిన ఉపేంద్ర తివారీ.. ఆ రోజు సమయం ముగుస్తుండటంతో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలోకి పరుగెత్తుకుంటూ వెళ్లారు.

Recommended Video

    UP Elections 2022 : UP ఓటర్లకు PM Modi విజ్ఞప్తి..రికార్డుల్ని బ్రేక్ చేసేద్దాం | Oneindia Telugu

    సెక్యూరిటీ సిబ్బంది కూడా మంత్రి వెంట పరుగులు తీశారు. నామినేషన్ దాఖలుకు మరో మూడు నిమిషాలు ఉండగా తన పత్రాలను అందజేశారు. సమయాభావం కావడంతోనే పరుగెత్తాల్సి వచ్చిందని మంత్రి ఉపేంద్ర తివారీ తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+