యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సభ సమీపంలో భారీగా పశువులను వదిలేసిన రైతులు

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతలు విమర్శలతో యుద్ధం చేస్తున్నారు. కాగా, రైతులు కూడా తమ నిరసనలను తెలియజేస్తున్నారు. పశువుల వల్ల తమ సమస్యలను ఎత్తిచూపేందుకు, ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో పలువురు రైతులు మంగళవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ర్యాలీ వేదిక సమీపంలోని బహిరంగ మైదానంలో పశువులను వదిలిపెట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. రైతు నాయకుడు రమణదీప్ సింగ్ మాన్ ట్వీట్ చేసిన వీడియోలో.. బహిరంగ మైదానంలో వందలాది పశువులను చూపిస్తుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో విచ్చలవిడి పశువుల బెడద ప్రధాన సమస్యగా మారింది.

UP polls: Farmers Release Stray Cattle Near CM Yogi Adityanaths Rally Site In Barabanki.

"బారాబంకిలో సిఎం ఆదిత్యనాథ్ కార్యక్రమానికి ముందు, రైతులు వందలాది పశువులను పొలాల నుంచి తరిమివేసి, ర్యాలీ జరిగిన ప్రదేశం దగ్గర వదిలివేశారు. ఈ విచ్చలవిడి పశువులను నిర్వహించడానికి రైతులు మార్గం కనుగొనలేకపోయారు" అని రమణదీప్ సింగ్ మాన్ వీడియోను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. .

ఐదేళ్లుగా యూపీ ప్రభుత్వం కూడా పరిష్కారం కనుగొనలేకపోయిందని, ఈ కార్యక్రమానికి ముందు బీజేపీ ఎలాంటి పరిష్కారాన్ని తీసుకువస్తుందో రైతులు చూడాలని ఆయన ట్వీట్ చేశారు.

యూపీలో బీజేపీ అధికారంలోకి వస్తే, అక్కడ సంచరించే పశువుల సమస్యను పరిష్కరిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ హామీని గుర్తు చేశారు యోగి ఆదిత్యనాథ్.

'విచ్చలవిడి జంతువుల వల్ల ప్రజలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడానికి మార్చి 10 తర్వాత కొత్త వ్యవస్థను రూపొందించబడుతుంది. పాలు ఇవ్వని జంతువు పేడ నుంచి మీరు ఆదాయాన్ని పొందగలిగేలా ఒక వ్యవస్థ రూపొందించబడుతుంది' అని ప్రధాని మోడీ గత వారం ర్యాలీలో అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో విచ్చలవిడి పశువులు పొలాల్లోకి ప్రవేశించడం, పంటలను లక్ష్యంగా చేసుకోవడం సర్వసాధారణంగా మారింది. ముఖ్యంగా బుందేల్‌ఖండ్ ప్రాంతంలో. దీంతో ఈ ప్రాంత రైతులు పశువులను పారద్రోలేందుకు రాత్రంతా మాచాన్‌లపై నిఘా ఉంచి ఆర్థికంగా నష్టపోతున్నారు.

ఎద్దుల దాడిలో గాయపడి మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తామని అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో విచ్చలవిడిగా పశువులు లేదా ఇతర జంతువుల వల్ల నష్టపోయిన వ్యవసాయ భూమికి ఎకరాకు రూ.3,000 పరిహారం ఇస్తామని హామీ ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే సమస్య తీవ్రతను గమనించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+