ముజఫర్ ఘర్షణలు: పక్కన పెట్టాలని జయప్రద హితవు
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని ముజఫర్ నగర్లో జరిగిన మతఘర్షణలు దురదృష్టకరమని, ఇలాంటి ఘర్షణలను ఏ పార్టీ కూడా తమ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోరాదని రాష్ట్రీయ లోక దళ్ నేత, ప్రముఖ నటి జయప్రద అ్నారు. మత ఘర్షణల అంశాన్ని ఏ పార్టీ కూడా ఓట్లురాల్చుకునేందుకు ఉపయోగించుకోవద్దని హితవు పలికారు.
జయప్రద ఇటీవలె ఆర్ఎల్డీ పార్టీలో చేరారు. ఆమెకు బిజ్నోర్ లోకసభ టిక్కెట్టును ఆ పార్టీ కేటాయించింది. ఆమె ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఇలాంటి సంఘటనలను ఓట్ల కోసం ఉపయోగించుకోవద్దని పార్టీలను కోరారు.

మత ఘర్షణల వంటి అంశాలకు బదులు రైతుల సమస్యలను, వారి సంక్షేమం, అభివృద్ధి అంశాలను అజెండాగా తీసుకోవాలని కోరారు. గత ఏడాది జరిగిన మత ఘర్షణల ద్వారా కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఇది సరికాదన్నారు.
జయప్రద గురువారం సాయంత్రం మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్లోని బిజ్నోర్ లోకసభ స్థానం నుండి ఆమె రానున్న సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేసిన జయప్రద.. ఆ తర్వాత యూపిలోని సమాజ్ వాది పార్టీలో చేరింది. ఎస్పీ నుండి అమర్ సింగ్తో పాటు బయటకు వచ్చారు. ఇటీవల ఆర్ఎల్డీలో చేరారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !!












Click it and Unblock the Notifications