ఉత్తర్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు చిన్నారులతో సహా 14 మంది మృతి..
ఉత్తర్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాగ్రాజ్ - లక్నో హైవేపై ఓ కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మొత్తం 14 మంది చనిపోగా వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన మానిక్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతులంతా నబబ్గంజ్లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం సంభవించింది. ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అన్ని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Pratapgarh: Fourteen persons including six children died after the vehicle they were travelling in collided with a truck on Prayagraj-Lucknow highway under limits of Manikpur police station last night. pic.twitter.com/2WOFMUyO8Z
— ANI UP (@ANINewsUP) November 20, 2020