ప్రేమ ఓకే, పెళ్లికి మాత్రం నో, అందుకే.. బాత్రూంలోకి తీసుకెళ్లి కోసి పారేసింది
ప్రియుడు తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన ప్రేయసి తెలివిగా అతడి పురుషాంగాన్ని కోసి పారేసింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని మంగోల్పురిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
న్యూఢిల్లీ: ప్రియుడు తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన ప్రేయసి తెలివిగా అతడి పురుషాంగాన్ని కోసి పారేసింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని మంగోల్పురిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. రవి(35) ఓ చిరు వ్యాపారి. స్థానిక మంగోల్పురిలో నివాసం ఉండే యువతి(23)ని కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడు. మొదట్లో ఆ యువతి ఇతడిని పట్టించుకోలేదు. కానీ క్రమంగా వీరి మధ్య పరిచయం పెరిగి.. అదికాస్తా ప్రేమగా మారింది.
ఇలా నాలుగేళ్లు గడిచిపోయాయి. పెళ్లి విషయం వచ్చేసరికి ఇద్దరి నడుమ విభేదాలొచ్చాయి. ఆ యువతి తన కుటుంబాన్ని పెళ్లికి ఒప్పించగా, ప్రియుడు రవి మాత్రం పెళ్లి విషయం వచ్చేసరికి దాటవేసేవాడు.
ఈ క్రమంలో బుధవారం రాత్రి రవి తన ఇంటికి రాగా.. ఎన్నాళ్లిలా.. పెళ్లెప్పుడు.. అంటూ ఆ యువతి గట్టిగా నిలదీసింది. 'మా ఇంట్లో వాళ్లు మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు, నన్ను మరిచిపో..' అని రవి అనడంతో ఆ యువతికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
నాలుగేళ్లుగా తనవెంట తిప్పుకుని మోసం చేసిన ప్రియుడికి బుద్ధి చెప్పాలనుకుంది. ఇంట్లో వాళ్లను కొద్దిసేపు బయటకు వెళ్లమని సూచించిన ఆ యువతి.. ఈ ఒక్కసారి తనతో శృంగారంలో పాల్గొంటే ఇక పెళ్లి మాట ఎత్తనని రవిని నమ్మించింది. చివరకు అతడిని నగ్నంగా బాత్రూమ్లోకి తీసుకెళ్లింది. ఆ వెంటనే తన వెంట తెచ్చుకున్న చాకుతో అతడి పురుషాంగాన్ని కోసిపారేసింది.
దీంతో నొప్పిని భరించలేక రవి హెల్ప్ అని అరుస్తూ బయటికి పరిగెత్తాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం సంజయ్ గాంధీ మెమొరియల్ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు పేషెంట్ను జైపూర్ గోల్డెన్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. యువతి సహా ఆమె కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారని దర్యాప్తు జరుపుతున్న మంగోల్పురి పోలీసులు తెలిపారు.