యూరీ ఉగ్రదాడిలో పాల్గొన్న వాళ్లంతా 20 ఏళ్ల లోపు వారే
యూరీ: జమ్మూ కాశ్మీర్లోని యూరీ సెక్టార్ 12వ బ్రిగెడ్ హెడ్ కార్వర్ట్స్పై నలుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడి 18 మంది జవాన్లను హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన అనంతరం ఆర్మీ ఉన్నతాధికారులు విచారణ జరుపగా ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి.
ఈ ఉగ్రదాడికి పాల్పడిన వారంతా 20 ఏళ్ల వయసు లోపు వాళ్లే. ఉగ్రవాదులకు పోస్టుమార్టం నిర్వహించిన శ్రీనగర్లోని 92 బేస్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాదులు తమను ఎవరూ గుర్తించకుండా దాడికి ముందు మిలటరీ సైనికుల మాదిరి హెయిర్ కటింగ్ చేయించుకున్నట్లు గుర్తించారు.
ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి 50 కిలోమీటర్లు దూరాన ఈ నలుగురి మృతదేహాలను ఖననం చేసినట్లు తెలిపారు. జీపీఎస్ ప్రకారం దాడికి ముందు ఈ నలుగురు మిలిటెంట్లు పాకిస్థాన్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఉగ్రవాదుల వద్ద నుంచి హై ప్రోటీన్గల చాక్లెట్లు, ఆరు రెడ్ బుల్ క్యాన్లు స్వాధీనం చేసుకున్నారు.

పాకిస్థాన్ గుర్తుగల మూడు ఓఆర్ఎస్ ఖాళీ ప్యాకెట్లు కూడా వారి వద్ద లభించాయి. ఉగ్రదాడికి ముందు స్థానికి గొర్రెల కాపరులు వీరికి సాయం చేశారన్న అనుమానంతో దర్యాప్తు సంస్ధలు ముగ్గురిని అదుపులోకి విచారించినట్లుగా సమాచారం.
పది మందిని మట్టుబెట్టిన భారత జవాన్లు
యూరీ సెక్టార్లో మంగళవారం సాయంత్రం ఉగ్రవాదులు మరోసారి చొరబాటుకి ప్రయత్నించారు. అయితే, అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం వారి చొరబాటును దీటుగా తిప్పికొట్టింది. పది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. పాక్ సైనికుల్లా వేషం వేసి ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించాలని చూశారు.
దీనిని కనిపెట్టిన భారత భద్రతాబలగాలు ఉగ్రవాదుల చొరబాటును వెంటనే కనిపెట్టి, దీటుగా జవాబిచ్చాయి. ఆర్మీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పాక్ చేసే కవ్వింపు చర్యలను ఉపేక్షించకుండా దీటుగా సమాధానం చెప్పాలని భద్రతా బలగాలకు కేంద్రం హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications