DiasporaDiplomacy : ప్రముఖ ఇండియన్ అమెరికన్లతో చెన్నై యూఎస్ కాన్సులేట్ కొత్త కార్యక్రమం...
చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ ఈ నెల 28వ తేదీ నుంచి #DiasporaDiplomacy సిరీస్ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఆయా రంగాల్లో ప్రముఖులైన ఇండియన్ అమెరికన్లతో కన్వర్సేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. తద్వారా వృత్తిపరమైన జర్నీ,అమెరికా-ఇండియా సంబంధాలను బలోపేతం చేయడంలో వారి పాత్ర తదితర అంశాలను చర్చకు పెట్టనుంది. అలాగే అమెరికా విద్య,వైద్య,వ్యాపార,ఆవిష్కరణ,అకడమిక్ రంగాల్లో ఇండో అమెరికన్ల పాత్ర గురించి చర్చించనుంది.
ఈ సిరీస్లో భాగంగా మొదట ఇండియన్ అమెరికన్ ఏరోస్పేస్ ఇంజనీర్ డా.స్వాతి మోహన్తో వర్చువల్ కన్వర్జేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జులై 28,సాయంత్రం 7గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. యూఎస్ కాన్సులేట్ జనరల్ అధికారి జుడిత్ రవీన్ ఈ సిరీస్ను ప్రారంభించనున్నారు.

ప్రస్తుతం డా.స్వాతి మోహన్ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన జెట్ ప్రపల్సన్ లేబోరేటరీ(జేపీఎల్)లో నేవిగేషన్,కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ గ్రూప్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. #DiasporaDiplomacy సిరీస్ ఇంటరాక్షన్లో భాగంగా డా.స్వాతి మోహన్ నేషన్స్ స్పేస్4విమెన్ నెట్వర్క్ మెంటార్ దీపన గాంధీతో,ఇతర విద్యార్థులు,జర్నలిస్టులు,స్పేస్ సైన్స్ పట్ల ఉత్సుకత కలిగినవారు,తదితరులతో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా తన ఇండియన్ అమెరికన్ మూలాలు,అమెరికాలో ఉన్నత విద్య, సైన్స్,టెక్నాలజీ,ఇంజనీరింగ్,మ్యాథ్స్ రంగాల్లో మహిళల పాత్రపై తన దృక్పథం,ప్రిజర్వెన్స్ మార్స్ రోవర్ మిషన్ తదితర అంశాలపై చర్చిస్తారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ లింక్ ద్వారా రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.
ఈ ఈవెంట్ చెన్నై యూఎస్ కాన్సులేట్ జనరల్ ఫేస్బుక్ పేజీలో... https://www.facebook.com/chennai.usconsulate/ ఈ లింక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వీక్షకులు తమ ప్రశ్నలను కామెంట్ బాక్స్లో అడగవచ్చు. అందులో నుంచి కొన్ని సెలెక్టివ్ ప్రశ్నలకు స్వాతి మోహన్ సమాధానాలిస్తారు.
#DiasporaDiplomacy సిరీస్లో భాగంగా నిర్వహించే రెండో కార్యక్రమంలో వర్చువల్ మ్యూజిక్ కాన్సర్ట్ను నిర్వహించనున్నారు.గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన ఇండియన్ అమెరికన్ సింగర్ ప్రియదర్శినితో అగస్టు 18న ఈ కార్యక్రమం ఉంటుంది. ఔత్సాహిక మ్యూజిషియన్స్కు ప్రియ,ఆమె టీమ్ వర్చువల్ వర్క్ షాప్ నిర్వహిస్తారు.
-
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
T20 world cup లో తెలివి తక్కువ జట్టు అదే-ఇండియా నాకౌట్ ఛాన్స్ మిస్ ? -
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
ట్రంప్కు తలనొప్పి.. పుతిన్కు పండగ!: భారత్, చైనాకు రష్యానే దిక్కు! -
‘బ్లాక్’ దందా: గ్యాస్ సిలిండర్ కావాలంటే రూ. 3,000 నుంచి రూ. 5,000 ఇవ్వాల్సిందే ! -
ఇరాన్ జీవనాడిపై అమెరికా దెబ్బ- ఓటమిని అంగీకరించిందని ట్రంప్ ప్రకటన -
ఖమేనీ ఆచూకీ చెప్పిన వారికి కోటి డాలర్లు -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు












Click it and Unblock the Notifications